కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికించేస్తోంది. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఈ కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే 10వేలమంది పైగా మరణించారు. 2 లక్షలకు పైగా ఈ కరోనా బారిన పడ్డారు. అలాంటి ఏఈ కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించి అతలాకుతలం చేస్తుంది. దీంతో ఈ కరోనా వైరస్ ను తరిమి కొట్టడానికి ప్రధాని మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.  

 

అసలు ఎం అని పిలుపునిచ్చారు అంటే.. రేపు ఆదివారం జనతా కర్ఫ్యూ కి పిలుపునిచ్చారు. ప్రజలందరూ కూడా రేపు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరుకు బయటకు రాకూడదు అని చెప్పారు. దీంతో ఎవరు కూడా ఆ సమయాల్లో బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలి అని టీవీలలో.. సోషల్ మీడియాలో సెలబ్రెటీలు చెప్తున్నారు. 

 

ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ వీడియో ద్వారా ''ప్రధాని మాట పాటిద్దాం..  కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం'' అని తెలిపారు. ఈ నెల 22 ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశమంతటా జనతా కర్ఫ్యూ పాటిద్దాం అని అయన పిలుపునిచ్చారు. 

 

అయితే ఇప్పుడు తాజాగా పవన్ కల్యాణ్‌తో పాటు సూపర్ స్టార్ మహేష్ కూడా ట్విట్టర్ ద్వారా మోదీ సందేశాన్ని అందరికీ తెలియజేశారు. మనల్ని రక్షించడానికి కరోనాతో యుద్ధం చేస్తున్న వారందరికీ సెల్యూట్ చేద్దాం. ప్రధాని చెప్పినట్లు మన బాల్కనీలలో నిలబడి వారిని గౌరవించుకుందాం. అందరూ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండండి..'' అంటూ మహేష్ బాబు ట్విట్ చేశారు. దీంతో ఈ ట్విట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: