తమిళ సినీ పరిశ్రమలో ఇప్పుడు నయనతార ఆడింది ఆట పాడింది పాటగా ఉంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఆమె అక్కడ స్టార్ హీరోలతో వరుసగా ఛాన్సులు కొట్టేస్తుంది. ఈ నేపథ్యంలోనే నయనతార పారితోషికం కూడా బాగా పెంచింది అనే వ్యాఖ్యలు ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇక స్టార్ హీరోలతో అవకాశాలు వచ్చినా ఆమె రెమ్యునరేషన్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదట. దీనితో ఆమెను పెట్టి సినిమా తీయాలనుకున్న దర్శక నిర్మాతలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

 

 ఇది పక్కన పెడితే ఇప్పుడు తమిళ సిని పరిశ్రమ ఆమె కారణంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఆమెకు వరుసగా ఆఫర్లు రావడంతో స్టార్ హీరోల సినిమా అయినా సరే కొన్ని రోజులు మాత్రమే డేట్స్ ఇస్తానని ఆ తర్వాత తాను చెప్పలేనని చెప్పడంతో నిర్మాతలు కూడా షాక్ అవుతున్నారు. ఇటీవల తమిళ స్టార్ హీరో అజిత్ తో ఆమెకు సినిమా చేయాలి అని ఆఫర్ వచ్చింది. అయితే అక్కడ రెమ్యూనరేషన్ భారీగా పెంచడమే కాకుండా తాను అయితే ఎక్కువగా షూటింగులో పాల్గొన లేకపోవచ్చు అని కేవలం 12 లేదా 15 రోజులు మాత్రమే షూటింగ్ లో ఉంటాను అని చెప్పటంతో నిర్మాతతో పాటుగా అటు అజిత్ కూడా షాక్ అయ్యాడట.

 

ఇప్పుడు ఆమె స్థానం లో వరలక్ష్మి శరత్ కుమార్ ని తీసుకునే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  సినిమా షూటింగ్  లో ఆమె రెమ్యునరేషన్ తో  పెట్టుకుంటే చిన్న హీరో తో ఒక సినిమా   చేసేయొచ్చు. అని వయసు మీద పడుతున్నా ఈ డిమాండ్ లు ఏంటి అని పలువురు నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పారితోషకం తగ్గించినట్లు తగ్గించి మళ్ళీ పెంచడంతో నిర్మాతల మండలి కూడా ఆమెను పక్కన పెడితే మంచిది అని భావిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: