ఈ ఉగాది కానుకగా విడుదల కావాల్సిన చిత్రాలలో అందరి అటెన్షన్ ని గెలుచుకున్న చిత్రంగా వి ఉండింది. కానీ కరోనా కారణంగా థియేటర్లన్నీ మూసివేయడంతో చిత్రాలన్నీ వాయిదా పడ్డాయి. నాని, సుధీర్ బాబు హీరోలుగా నటించిన ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు బాగా ఉన్నాయి. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహనక్రిష్ణ దర్శకత్వం వహించాడు.

 


థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని నెగెటివ్ షేడ్స్ లో కనిపించనున్నాడు. నాని మొట్ట మొదటిసారిగా నెగెటివ్ రోల్ చేస్తున్న సినిమాగా ప్రచారం చేస్తున్నారు. ఇంద్రగంట్ మోహనక్రిష్ణ మొదటిసారిగా పూర్తి కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ ని తెరకెక్కించాడు. ఇప్పటికే రిలీజైన టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. నిజానికి ఈ సినిమా నాని, సుధీర్ బాబులతో చేయాల్సిన సినిమా కాదట.

 


పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో ఈ సినిమా చేయాల్సింది అని సుధీర్ బాబు తెలిపాడు. ఇంద్రగంటి మోహనక్రిష్ణ ఈ కథ రాసుకున్నప్పుడు వాళ్లని దృష్టిలో పెట్టుకునే రాసాడని చెప్పాడు. మరి వాళ్లై దృష్టిలో పెట్టుకుని రాసిన కథని వాళ్ళకి వినిపించాడా లేదా అన్నది సందేహంగా ఉంది. అయితే మరో విషయం ఏమిటంటే వి సినిమాని తనను తాను నిరూపించుకోడానికే తీశాడని తెలుస్తుంది.

 

ఇంద్రగంటి ఇప్పటి వరకు స్టార్స్ తో సినిమాలు చేయలేదు. ఇప్పుడు చేస్తున్న ఈ కమర్షియల్ చిత్రం ద్వారా తాను స్టార్స్ ని డీల్ చేయగలననే నమ్మకం కలిగించడానికే ఈ సినిమా చేశాడని అంటున్నారు.  మరి సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు ఏ విధంగా ఇంద్రగంటి ఆ సినిమాని పవన్, మహేష్ తో తీయాలని అనుకున్నాడో..! కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవనుందో ఇంకా క్లారిటీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: