టాలెంట్ ఉన్నోడిని ఎవరూ విడిచిపెట్టరు. లాభాలు తీసుకొస్తాడు అనే నమ్మకముంటే చాలు అతన్ని పక్కనే పెట్టుకుంటారు. ఇప్పుడు అర్జున్ రెడ్డి మేకర్ సందీప్ వంగని ఇలాగే విడిచిపెట్టడం లేదు బాలీవుడ్ నిర్మాతలు. ఈ పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ తో వరుస సినిమాలు తీస్తోంది బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌజ్. 

 

అర్జున్ రెడ్డితో టాలీవుడ్ లో వైబ్రేషన్స్ పాస్ చేశాడు సందీప్ వంగా. ఈ బోల్డ్ లవ్ స్టోరీతో నార్త్ ఇండస్ట్రీని మెప్పించాడు. ఫస్ట్ మూవీతోనే డేరింగ్ అటెంప్ట్ చేసిన సందీప్ తో సినిమాలు చేసేందుకు మహేశ్ బాబు, రామ్ చరణ్ ఇంట్రెస్ట్ గా ఉన్నారనే ప్రచారం జరిగింది. స్టోరీ నెరేట్ చేశాడనే టాక్ కూడా వచ్చింది. కానీ ఈ కాంబినేషన్స్ వర్కవుట్ కాలేదు. 

 

సందీప్ వంగా తర్వాత బాలీవుడ్ కు వెళ్లిపోయాడు. టి-సిరీస్ నిర్మాణంలో షాహిద్ కపూర్ తో కబీర్ సింగ్ తీశాడు. అర్జున్ రెడ్డి రీమేక్ గా రూపొందిన ఈ కబీర్ సింగ్ కు రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. నిర్మాతలు భారీగా లాభపడ్డారు. దీంతో ఈ డైరెక్టర్ ని అసలు వదిలిపెట్టట్లేదు టీ సిరీస్. సందీప్ తో వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. 

 

టీ సిరీస్ ఇంతకుముందు సందీప్ తో ఓ క్రైమ్ థ్రిల్లర్ అనౌన్స్ చేసింది. ఇప్పుడు ప్రభాస్-సందీప్ కాంబినేషన్ లో ఓ మల్టీలింగ్వల్ ప్లాన్ చేస్తోంది. సందీప్ రీసెంట్ గానే ప్రభాస్ కు ఓ లైన్ వినిపించాడని.. ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అయ్యాక అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని చెబుతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తర్వాత నాగ్ అశ్విన్ తో మూవికి కమిట్ అయ్యాడు. ఈ ప్రాజెక్ట్స్ తర్వాత ప్రభాస్-సందీప్ మూవీ ఉండే అవకాశముంది. మొత్తానికి సందీప్ వంగా క్రియేటివ్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: