కొందరికి డబ్బు అంటే పిచ్చి. మరికొందరి సినిమాలంటే అంటే ఇష్టం.మరికొందరికి సినిమా వారిపై వచ్చే గ్యాసిప్స్ అంటే చెప్పలేని సంతోషం. టీవీ సీరియల్స్ చూడని వారు ఉంటారేమో కానీ గాసిప్స్ వినని వారు ఉండరు. అయితే తాజాగా చిరంజీవి కొత్తగా వస్తున్న రూమర్స్ వస్తున్న వీటిని ఖండిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేసింది చిత్ర నిర్మాణ భాగస్వామ్యంగా ఉన్న మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్.


టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం 'ఆచార్య'. మెగాస్టార్ కెరీర్ లో 152వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా పై సినీ వర్గాలలో మెగా అభిమానులలో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

 

కొరటాల శివ పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో టాప్ డైరెక్టర్ స్థానంలోకి చేరాడు. తన ప్రతి సినిమాలో ఏదొక సందేశంతో మాస్-క్లాస్ ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేస్తూనే ఉన్నాడు కొరటాల. ఇటీవలే 'సైరా నరసింహరెడ్డి' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మెగాస్టార్ 'ఆచార్య'తో త్వరలో థియేటర్లలో సందడి చేయనున్నాడు.

 

అయితే ఆచార్య సినిమా షూటింగులో ఉండగానే.. సినిమా గురించి చర్చలు వివాదాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఆచార్య సినిమాను మాట్నీ ఎంటర్టైన్మెంట్ కొణిదెల ప్రొడక్షన్స్ రెండు సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొణిదెల ప్రొడక్షన్స్ నుండి ఆచార్య సినిమా నిర్మాణానికి రాంచరణ్ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయట్లేదని మొత్తం ప్రొడక్షన్ అంతా మాట్నీ ఎంటర్టైన్మెంట్ వారే చూసుకుంటున్నారని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. రాను రాను ఇలాంటి వార్తలు సినిమాను దెబ్బతీసేలా ఉన్నాయని మాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ ఈ విషయం పై స్పందించింది.

 

ఆచార్య సినిమా నిర్మాణంలో మాట్నీ ఎంటర్టైన్మెంట్ వారి బడ్జెట్ ఎంత ఉందో కొణిదెల ప్రొడక్షన్స్ వారిది కూడా అంతే ఉందని తెలిపారు. అంతేగాక ప్రతి ఖర్చులోను నిర్మాత రాంచరణ్ తమతో సగం ఖర్చును షేర్ చేసుకుంటున్నట్లు వివరించారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మొద్దని ఇలాంటి ఫేక్ వార్తలు సృష్టించే వారికి సమాధానం దొరికిందని భావిస్తున్నట్లు" మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి స్పందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: