దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వం లో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ వల్ల షూటింగ్ ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ని ఆపారు జక్కన్న. తిరిగి ఈ షెడ్యూల్ ఏప్రిల్ నెలలో మొదలు కానుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ 'కొమరం భీమ్' గా రామ్ చరణ్ 'అల్లూరి సీతారామరాజు' గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

 

ఇక 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్ దశలో ఉండగానే రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో రక రకాల రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. 'ఆర్ఆర్ఆర్' తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో నెక్స్ట్ సినిమాని చేయబోతున్నారని ఈ సినిమాని దుర్గ ఆర్ట్స్ అధినేత డా. కే ఎల్ నారాయణ నిర్మించబోతున్నట్లు ఇంతకముందు న్యూస్ వచ్చి వైరల్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఆ ప్రాజెక్ట్ గురించి అటు మేకర్స్ గాని ఇటు మహేష్ బాబు గాని అధికారకంగా వెల్లడించింది లేదు. 

 

ఇదిలా ఉండగానే తాజాగా మరో న్యూస్ బయటకి వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత 'ఇస్మార్ట్ శంకర్' హిట్ తో ఫాం లోకి వచ్చిన యంగ్ హీరో రామ్ తో రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం ఇప్పటికే తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ను స్టోరీ రెడీ చెయ్యమని చెప్పారట జక్కన్న. అయితే ఇది కంప్లీట్ ఫేక్ న్యూస్ అని సమాచారం. అసలు 'ఆర్ఆర్ఆర్' తప్ప ఇప్పుడు మరో సినిమా గురించి గాని మరో హీరో గురించి గాని రాజమౌళి ఆలోచించడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: