యాంకర్ గా బుల్లితెర మీద తన హవా కొనసాగిస్తూనే వెండితెర మీద కూడా సందడి చేస్తుంది అనసూయ భరధ్వాజ్. క్షణం సినిమా నుండి కథనం వరకు అనసూయ సిల్వర్ స్క్రీన్ పై కూడా తన సత్తా చాటాలని చూస్తుంది. రెగ్యులర్ గా కాకుండా సినిమాల్లో అమ్మడు తన మార్క్ చూపించేలా స్పెషల్ రోల్స్ చేస్తూ వస్తుంది. తన కెరియర్ లో రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ఎప్పటికి గుర్తుంటుంది. సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా అనసూయకు మంచి పేరు తీసుకొచ్చింది. 

 

అదే జోష్ తో సుకుమార్ తను తీయబోతున్న అల్లు అర్జున్ సినిమాలో కూడా అనసూయకు ఒక మంచి రోల్ ఇచ్చాడు. రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర లానే ఈ సినిమాలో కూడా వేశ్య పాత్రలో అనసూయని చూపించాలని అనుకున్నారు సుక్కు. ముందు అనసూయ ఈ పాత్రకు ఓకే చెప్పినా ఇప్పుడు ఆ పాత్ర చేసేందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తుందట. ప్రస్తుతం తనకున్న ఇమేజ్ కు ఆ పాత్ర మ్యాచ్ అవధాని దాని వల్ల కెరియర్ రిస్క్ లో పడుతుందని భావిస్తోందట. 

 

అందుకే అల్లు అర్జున్ సినిమా నుండి అనసూయ తప్పుకుందని అంటున్నారు. బన్ని కూడా ఈ సినిమాలో తన లుక్, యాస కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట. ప్రస్తుతం చిత్తూరు యాస ప్రాక్టీస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమా నుండి అనసూయ వెళ్లడం అందరిని షాక్ అయ్యేలా చేసినా ఆమె ప్లేస్ లో ఎవరిని తీసుకుంటారో తెలియాల్సి ఉంది. రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ అవనుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగా పెట్టేస్తున్నారట. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: