కరోనా వైరస్ హడావిడి లేకుంటే ఈ పాటికి ఉగాది సినిమాల విడుదల హడావిడితో మీడియా హోరెత్తి పోతూ ఉండేది. ఈనెల 25న రాబోతున్న ఉగాది పండుగను టార్గెట్ చేస్తూ నాని తన ‘వి’ సినిమాను విడుదలచేసి సమ్మర్ సినిమాల రేసును ప్రారంభించాలని చాలా ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు అయితే అతడి ప్లాన్స్ ను కరోనా దెబ్బతీసింది.  


ప్రస్తుతానికి ఈ సినిమా వాయిదా పడిపోవడంతో పాటు ఎప్పుడు మళ్ళీ రిలీజ్ అవుతుందో తెలియని కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీలో కీలక పాత్రలో నటించిన సుధీర్ బాబు ఆలీ నిర్వహించే టాక్ టీవీ షోకు అతిధిగా వచ్చి ఈ సినిమాకు సంబంధించిన ఒక టాప్ సీక్రెట్ బయటపెట్టాడు.  వాస్తవానికి దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ ‘వి’ సినిమాకు సంబంధించి అనుకున్న నటులు తాను నాని కాదని ఆపాత్రలను మహేష్ బాబు పవన్ కళ్యాణ్‌ లను దృష్టిలో ఉంచుకుని ఇంద్రగంటి మోహన్ కృష్ణ వ్రాసినట్లు షాకింగ్ సీక్రెట్ చెప్పాడు. 


ఈ మూవీలో నాని నటించిన నెగిటివ్ పాత్రలో మహేష్ నటిస్తే తాను నటించిన పోలీసు ఆఫీసర్ పాత్రలో పవన్ నటించే విధంగా ఇంద్రగంటి ఈ మూవీకి స్క్రిప్ట్ ను డిజైన్ చేసుకున్నాడట. అయితే ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈ సినిమాకు సంబంధించిన తన ఆలోచనలను ఒక ప్రముఖ నిర్మాణ సంస్థకు చెప్పినా పవన్ మహేష్ తో ఒక మల్టీ స్టారర్ తీయడం అనే ఆలోచన జరగని విషయం అని చెప్పడంతో ఇంద్రగంటి రాజీ పడిపోయి ఆ కధను నానీ సుధీర్ బాబుల మల్టీ స్టారర్ గా మార్చిన విషయాన్ని సుధీర్ బాబు బయటపెట్టాడు 

 

కెరీర్ ఆరంభం నుంచి చిన్న మీడియం రేంజ్ హీరోలతోనే ఇంద్రగంటి సినిమాలు చేస్తున్నాడు. దీనితో అతడి సినిమాల స్థాయి కలక్షన్స్ కూడ ఆ స్థాయిలోనే ఉంటున్నాయి. దీనికితోడు ఇంద్రగంటి స్టార్ హీరోలను డీల్ చేయలేడు అన్న ఒక ముద్ర  పడి పోవడంతో ఇంద్రగంటి ఆశలు కలలుగానే మిగిలిపోయాయి. ‘’వి’ విడుదలై ఘనవిజయం సాధిస్తే అప్పటికైనా స్టార్ హీరోలకు ఇంద్రగంటి పై నమ్మకం ఏర్పడుతుందేమో చూడాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: