ఒక్క హిట్ కోసం ఎన్నో ఏళ్ల పాటు ఎదురు చూసిన టాలీవుడ్‌ హీరో నితిన్‌. లాంగ్ గ్యాప్ తరువాత హిట్ ట్రాక్‌ లోకి వచ్చినట్టుగానే కనిపించిన నితిన్‌, మళ్లీ వెంటనే గాడి తప్పాడు. వరుస ఫెయిల్యూర్స్ తో కష్టాల్లో పడ్డాడు. తాజాగా భీష్మా సినిమాతో మరోసారి సత్తా చాటి సక్సెస్ ట్రాక్‌ లోకి వచ్చాడు నితిన్‌. అదే జోరులో జాగ్రత్తగా సినిమాలు ప్లాస్ చేస్తున్నాడు. అయితే హీరోగా కొనసాగుతూనే నిర్మాతగానూ తన అధృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

 

తన బెస్ట్ ఫ్రెండ్‌, అక్కినేని నట వారసుడు అఖిల్ ను హీరోగా పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నాడు నితిన్‌. అఖిల్ సినిమాతో నిర్మాతగా మారిన నితిన్, తొలి ప్రయత్నంలో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఆ సినిమా డిజాస్టర్ కావటంతో నితిన్, నిర్మాతగానూ ఫెయిల్ అన్న టాక్ వినిపించింది. అయితే తాజాగా మరోసారి నితిన్ అదే రిస్క్ చేయబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అఖిల్ తదుపరి చిత్రాన్ని నితిన్ నిర్మించే ఆలోచనలో ఉన్నాడు.

 

ఈ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు. అఖిల్ కోసం స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను రికమండ్‌ చేశాడట. మరి ఈ సినిమాతో అయినా నితిన్‌, అఖిల్‌ సినిమాతో నష్టపోయినా మొత్తాన్ని రికవర్ చేస్తాడేమో చూడాలి. ప్రస్తుతం అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. ఇక నితిన్ విషయానికి వస్తే భీష్మా సినిమాతో సక్సెస్ అందుకున్న నితిన్‌, ఇప్పటికే వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్‌ దే షూటింగ్ ను పూర్తి చేశాడు. ఈ సినిమా తరువాత చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా, కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు నితిన్.

మరింత సమాచారం తెలుసుకోండి: