కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ కు భయపడి దాదాపు ప్రపంచం అంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఎప్పుడు బిజీగా ఉండే సెలబ్రిటీలు కూడా ప్రస్తుతం ఇంటికే పరిమితమవ్వటంతో కుటుంబ సభ్యులతో కలిసి కాలం గడుపుతున్నారు. దీంతో అందరూ తమ ఆనందాన్ని పంచుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
ఈ నేపధ్యంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్వారెంటైన్ టైం లో ప్రియాంక చోప్రా భర్తతో కలిసి ఇంటికే పరిమితమైంది. ఈ సందర్భంగా తన భర్త ఒడిలో తన పెట్టుకొని పడుకొని ఉన్న ప్రియాంక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. క్వారెంటైన్ టైమ్ ను ఇంత క్వాలిటీ గా వాడుతున్నావా అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజెన్లు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అంతర్జాతీయ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా, మూడు హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. వీటితో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ, నిర్మిస్తోంది ప్రియాంక.