తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి సంబంధించి అరడజనుకు పైగా హీరోలు ఉన్న విషయం తెలిసిందే. చాలా మంది హీరోలు ఉన్నప్పటికీ ఎవరికి వారు తమ కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు.. ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని  దూసుకుపోతున్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు రామ్ చరణ్అల్లు అర్జున్ స్టార్ హీరోలుగా కొనసాగుతుంటే... సాయి ధరంతేజ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు మంచి క్రేజ్ సంపాదించి స్టార్ హీరో రేసులో చేరేందుకు అడుగు దూరంలో ఉన్నారు. ఇలా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అందరూ మంచి గుర్తింపు సంపాదిస్తున్నారు. అయితే కొన్ని రోజుల్లో మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. 

 

 

 ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా మేనల్లుడుగా  ఎంట్రీ ఇచ్చిన సాయి ధరంతేజ్ మంచి గుర్తింపు సంపాదించి ప్రేక్షకులకు సుప్రీం హీరోగా మారిపోయాడు. ఇక ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడు. వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన అనే సినిమా తెరకెక్కుతుంది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

 

 

 ఏప్రిల్ 2వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించగా.. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం వల్ల ఈ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఉప్పెన సినిమాని మే 7వ తేదీన విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందట. అయితే ఈ రోజు కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే... గతంలో మే 7వ తేదీన మెగా మేనల్లుడు అల్లు అరవింద్ ఆర్య సినిమా విడుదలైంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు అల్లు అర్జున్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక మరో విషయం ఏమిటంటే ఆర్య సినిమాను సుకుమార్ తెరకెక్కించారు. మరి ఇప్పుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న గా.. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మే 7 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు  తెలుస్తోంది. గతంలో అల్లు అర్జున్ కి కలిసొచ్చిన ఈ ముహూర్తం వైష్ణవ్ తేజ్ కి  ఎంత వరకు కలిసొస్తుంది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: