ప్రపంచంలో కరోనా ధాటికి పిట్టల్లా రాలిపోతున్నారు.  చైనాలోని పుహన్ లో పుట్టుకొచ్చిన ఈ భయంకరమైన కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచం మొత్తం వ్యాపించింది.  ముఖ్యంగా కరోనా ఎఫెక్ట్ చైనా తర్వాత ఇటలీ, ఫ్రాన్స్ లో ఎక్కువగా కనిపిస్తుంది.  తాజాగా భారత దేశంలో ఈ రోజు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. నేడు యావత్ భారత దేశం జనతా కర్ఫ్యూ విధిగా పాటిస్తున్నారు.  కరోనా నిర్మూలన కోసం సెలబ్రెటీలు తమ సందేశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.  తాజాగా బాలీవుడ్ న‌టి ర‌వీనా టాండ‌న్ త‌న వంతు బాధ్య‌త‌గా వీడియోని విడుద‌ల చేసింది. ఇటీవ‌ల బాంద్రాకి వెళ్లి అక్క‌డ ట్రైన్‌లోని సీట్స్‌ని శానిటైజ‌ర్‌తో శుభ్రం చేసింది. అంతేకాదు ఆ విజువ‌ల్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో మొహానికి మాస్కు కట్టుకుని అక్కడున్న సీట్లతో పాటు ఆ భోగీని శుభ్రం చేస్తుండ‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు.  ట్రైన్ ఎక్కే ముందు శానిటైజ‌ర్‌, గ్లౌస్‌లు, ముఖానికి మాస్క్ త‌ప్ప‌క ధ‌రించాల‌ని అంటుంది ర‌వీనా టాండ‌న్‌.

 

కరోనా వైరస్ ని రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అంటున్నారు.  ఈ దారుణమైన కరోనా వైరస్ భారిన ఇప్పటికే 200 పైగా కేసులు నమోదు అయ్యాయి. కరోనా వ్యాప్తి అరికట్టడానికి ప్రతి ఒక్కరూ తమ వంత బాధ్యత వహించాలని..   క్ష‌మించండి అని చెప్ప‌డం కంటే సుర‌క్షితంగా ఉండ‌డం మంచిది. అవ‌స‌ర‌మైతేనే ప్ర‌యాణించండి. ద‌య‌చేసి మీ గురించి మీ చుట్టు ప‌క్క‌ల వారి విష‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు, భ‌ద్ర‌త తీసుకోండి. ద‌యచేసి మార్చి 31 వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రు ఇంటికే ప‌రిమితం కండి అని పిలుపునిచ్చింది ర‌వీనాటాండ‌న్‌.

 

ర‌వీనా టాండ‌న్‌ తెలుగులో కూడా నటించింది.  తాజాగా కన్నడ రాక్ స్టార్ యష్ నటిస్తున్న ‘కేజీఎఫ్ 2’ లో ముఖ్యపాత్రలో నటిస్తుంది.  మొత్తానికి బాలీవుడ్ నటి ర‌వీనా టాండ‌న్‌ చేసిన పని అందరికీ ఎంతో ఆదర్శంగా నిలుస్తుందని.. కరోనా చిన్నా పెద్దా.. సామన్యులు సెలబ్రెటీల అన్న తేడా ఉండదు.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: