టాలీవుడ్ లో తక్కువగానీ బాలీవుడ్ లో ప్రతీ ఒక్క స్టార్ హీరో తన సినిమాలో ఎంతో కొంతభాగం డబ్బులు పెడుతుంటారు. స్టార్ హీరోలు చేసే సినిమాలకి మార్కెట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే తమ సినిమాల్లో తామే పెట్టుబడులు పెడుతుంటారు. టాలీవుడ్ లో ప్రస్తుతం ఈ విధంగా చేస్తున్న వాళ్లలో మొదట మహేష్ పేరు వినిపించగా, రెండవ పేరు ప్రభాస్ దే కనిపిస్తుంది.

 

 


అయితే ప్రస్తుతం ఈ లిస్ట్ లో ఎన్టీఆర్ కూడా చేరిపోనున్నాడు. ఎన్టీఆర్ కొత్త బ్యానర్ ని స్టార్ట్ చేసే పనిలో ఉన్నాడని టాక్. ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా కలిసి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా కొంతమేర పెట్టుబడి పెడుతున్నాడట. అన్న కళ్యాణ్ రామ్ తో కలిసి ఈ సినిమా ప్రొడక్షన్ ని కొంత మేర పంచుకుంటున్నాడు.

 

 

 

అయితే త్రివిక్రమ్ సినిమా తర్వాత ఎన్టీఆర్ సొంతంగా నిర్మాణ సంస్థని ప్రాఅంభించనున్నాడు. ఆ బ్యానర్ కి నందమూరి హరిక్రిష్ణ ఆర్ట్స్ అని పేరు పెట్టాలని భావిస్తున్నాడట. నందమూరి హరిక్రిష్ణ ఆర్ట్ బ్యానర్ పేరుతో స్టార్ట్ అయ్యే ఈ నిర్మాణ సంస్థలో ఎన్టీఆర్ తర్వాతి సినిమాలన్నీ తెరకెక్కుతాయని ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ చేసే చిత్రాలకి కొంతభాగం నందమూరి హరిక్రిష్ణ ఆర్ట్స్ నుండి డబ్బులు పెడతారట.

 

 


ఈ విధంగా సంయుక్తంగా సినిమాలు నిర్మించడం ఆరోగ్యకరమే అని భావిస్తున్నారు. పెద్ద హీరోల సినిమాలని ఇలా నిర్మించడం వల్ల ఒకవేళ నష్టపోయినా ఒక్కడి మీదే భారం పడకుండా ఉంటుందని, అలాగే హీరోనే డబ్బులు పెట్టినపుడు మరింత బాధ్యతగా ఉంటారని అంటున్నారు.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: