స్టార్స్ రణబీర్ కపూర్  ఆలియాభట్ ప్రేమ గురించి తెలియని వారు ఉండరు. ఎన్నో  రోజులనుండి ఈ ఇద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఎక్కడ చూసినా వీరిద్దరూ దర్శనమిస్తూ అందరిని అలరిస్తున్నారు. ఎప్పుడు ఒకరిని విడిచి ఒకరు ఉండకుండా..ఎంతో ప్రేమగా మెలుగుతూ అటు అభిమానులను కూడా అలరిస్తూనే ఉన్నారు ఈ జంట. ఇక ఆలియా భట్ రణ్ బీర్  కపూర్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని... ఏడాదిలోనే వీరిద్దరికీ పెళ్లి కూడా జరగబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే వీరిద్దరి పెళ్లి విషయంపై బాలీవుడ్ స్టార్స్ ఎప్పుడు స్పందించకపోయినప్పటికీ... అభిమానులు సినీ ప్రేక్షకులు కూడా ఈ ఇద్దరికీ త్వరలో పెళ్లి జరగబోతుంది అని ఫిక్స్ అయిపోయారు. 

 

 

 ఇదిలా ఉంటే తాజాగా వీరిద్దరికీ బ్రేకప్ అయిపోయింది అంటూ బాలీవుడ్లో చాలామంది చర్చించుకుంటున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు... మొన్నటి వరకు ఎక్కడ చూసినా వీరిద్దరూ ఒకే దగ్గర ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత  క్లోజ్ గా ఉంటూ... ఇంకొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు అనే విధంగానే ఉన్నారు. కానీ కొన్ని రోజుల క్రితం ఓ పార్టీలో కొంతమంది స్నేహితులతో ఆలియాభట్ పాల్గొంది. అక్కడున్న వారు రణబీర్కి కూడా మంచి స్నేహితులే. అయితే అక్కడ పార్టీలో పాల్గొన్న ఫోటోలు ఆలియాభట్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే ఈ ఫోటో కాస్త అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అందులో ఆలియా భట్ పక్కన రణబీర్ కపూర్ ఎక్కడ కనబడలేదు. 

 

 

 ఎప్పుడు రణబీర్ ని వదిలి క్షణమైన ఉండని ఆలియా  ఇప్పుడు ఎందుకు ఒంటరిగా ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అని అందరిలో  అనుమానం మొదలైంది.. ఇంతలోనే వీరిద్దరికీ బ్రేకప్ అయ్యిందని ప్రచారం కూడా ఊపందుకుంది. అయితే ఈ వార్తలన్నిటికి  చెక్ పెడుతూ తాజాగా ఆలియా  చాలా తెలివిగా సమాధానం చెప్పింది. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి ఒక ఫోటో ని పోస్ట్ చేస్తూ... ఇంట్లో సంధ్యా సమయం ఎంజాయ్ చేస్తున్నాను.. ఈ ఫోటో క్రెడిట్ మొత్తం నా అభిమాన ఫోటోగ్రాఫర్ రణబీర్ కపూర్ దే అంటూ ఓ పోస్ట్ పెట్టడం ద్వారా... ప్రస్తుతం బాలీవుడ్ స్టార్స్ రణబీర్ అలియా  మధ్య ఎలాంటి విభేదాలు రాలేదు అని అందరికీ క్లారిటీ వచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: