మ‌హేష్‌బాబుకి ఎప్పుడూ త‌న వెంటే ఉంటూ త‌న భార్య న‌మ్ర‌త ప్ర‌తి వ‌ర్క్‌ల‌నూ తోడుగా ఉంటారు. ఆమె మ‌హేష్‌బాబుకి మ‌హేష్‌కి  ఓ ట్ర‌బుల్ షూట‌ర్ అని చెప్పాలి.  మ‌హేష్ ఎంత వ‌ర‌కు మార్చాలో అంత వ‌ర‌కు మార్చి వ‌రుస బ్రాండ్‌ల‌కి బ్రాండ్ అంబాసిడ‌న్‌ని చేసింది న‌మ్ర‌తే. మ‌హేష్ ట్ర‌బుల్స్‌లో వుంటే రంగంలోకి దిగి ప్రెస్‌ని ఏకంగా ఏడిట‌ర్ల‌కి ఫోన్ చేసి మ‌రీ ఫేవ‌ర్ చేయండ‌ని అడిగేస్తుంటారామె.

 

ఇక `శ్రీ‌మంతుడు` సినిమా స‌మ‌యంలో కీల‌క మీడియా అధినేత‌ల‌కు, ఎడిట‌ర్ల‌కు ఫోన్‌లు చేసి మ‌రీ మ‌హేష్ సినిమాని కొంచెం ప్ర‌యోట్ చేయంమ‌ని అడిగింద‌ట‌. స్వ‌యంగా న‌మ్ర‌తే ఫోన్ చేసి అడ‌గ‌డంతో అంద‌రూ స‌పోర్ట్‌గా నిలిచారు. సినిమాలో విష‌యం వుంది కాబ‌ట్టి మ‌రింత‌గా స‌పోర్ట్ చేశారు. సినిమా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు కూడా మ‌హేష్ త‌న నెక్ట్స్ ఫిల్మ్ విష‌యంలో కాస్త కన్‌ఫ్యూజ‌న్‌లో వున్నాడు. వంశీ పైడిప‌ల్లి సినిమాని ప‌క్క‌న పెట్టిన మ‌హేష్ ఆ స్థానంలో ప‌ర‌శురామ్‌ని లైన్‌లోకి తీసుకొచ్చాడు. ఇదే టైమ్‌లో వెంకీ కుడుముల ట్రెంమండ‌స్ లైన్ వినిపించాడ‌ట‌. వెంట‌నే మ‌హేష్ ఓకే చెప్పేశాడ‌ట‌.

 

ఇప్ప‌డు ఈ ఇద్ద‌రిలో ఎవ‌రితో ముందు సినిమా మొద‌లుపెట్టాల‌న్న‌ది మ‌హేష్ కన్‌ఫ్యూజ‌న్ లో ఉన్నాడు. దానికి తెరతీయాలంటే న‌మ్ర‌త మ‌ళ్లీ రంగంలోకి దిగాల్సిందే అంటున్నారు. అందుకే ఆ బాధ్య‌త‌ను మ‌హేష్ న‌మ్ర‌త‌కే వ‌దిలేశార‌ట‌. ఆమె ఎవ‌రితో ముందుకు వెళ్లాల‌ని డిసైడ్ చేస్తే వారితో సినిమా మొద‌లు పెట్టాల‌ని మ‌హేష్ ఆలోచిస్తున్నాడ‌ట‌. ఇది డైరెక్ట‌ర్స్‌కి టెన్ష‌న్ పుట్టిస్తోంద‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే మ‌రో ప‌క్క మ‌హేష్‌కి త్రివిక్ర‌మ్‌తో సినిమా తీయాల‌నే ఆలోచ‌న కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాక‌పోతే త్రివిక్ర‌మ్ ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు. మ‌ళ్ళీ ఏడాది పాటు ఆగితేనే గాని సినిమాని తియ్య‌లేరు. మ‌రి ఎవ‌రితో ముందుగా సినిమా తీస్తారు అన్న‌ది ఇటు డైరెక్ట‌ర్స్‌కే కాదు అటు ఫ్యాన్స్‌కి కూడా టెన్ష‌న్‌లో ఉన్నారు. ఇక న‌మ్ర‌త ఎటు డిసైడ్ చేస్తే మ‌హేష్ అటు వెళ్ళ‌డ‌మే ప‌ని.

మరింత సమాచారం తెలుసుకోండి: