ఉయ్యాల జంపాలా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై సూపర్ డూపర్ హిట్ కొట్టిన హీరో రాజ్తరుణ్. ప్రస్తుతం వరుస ఫ్లాప్లతో కెరీర్ ఇక ముగినట్టే అనే స్థాయికి చేరుకున్నాడు ఈ హీరో. కెరీర్ ప్రారంభంలో వరుస విజయాన్ని సొంతం చేసుకున్నా ఆ తరువాత నుంచి మాత్రం వరుస ఫ్లాప్లు, తండ్రి కారణంగా చెడ్డ పేరు.. ఇలా ఇంటా బయటా చికాకులతో సతమతమవుతున్నాడు హీరో రాజ్ తరుణ్. ప్రస్తుతం అతని ఆశలన్నీ విజయ్ కుమార్ కొండ రూపొందించిన `ఒరేయ్ బుజ్జిగా` చిత్రం పైనే వున్నాయి.
ఇది ఆడితేనే రాజ్ తరుణ్ మళ్లీ పైకి లేస్తాడు. లేదంటే ఇంక బట్టలు సదిరేసుకోవలసిందే అని అందరూ అంటున్నారు. నాలుగు సినిమాలొస్తాయి. లేదంటే వరుణ్సందేశ్లా తెరమరుగు కావాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో వున్న ఇతనికి మెగా హీరో అండగా నిలిచాడు. అతనే వరుణ్తేజ్. ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్న `బాక్సర్` చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఇటీవలే వైజాగ్లో ప్రారంభమైంది. అల్లు అరవింద్ సమర్పణలో సిద్దు ముద్దతో కలిసి అల్లు వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న సిద్దు ముద్దతో రాజ్ తరుణ్ హీరోగా ఓ సినిమా సెట్స్పైకి వచ్చేలా వరుణ్ తేజ్ ప్లాన్ చేశారట.
మోహన్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రం ద్వారా పరిచయం కానున్నాడట. వరుణ్ ప్రోత్సాహంతో మోహన్, సిద్దు ముద్ద ఇద్దరు కలిసి ఇటీవల రాజ్ తరుణ్ని కలిసి ప్రాజెక్ట్ని ఓకే చేయించుకున్నారట. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుందని, దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందని తెలిసింది. మరి ఇంత మంచి అవకాశం వచ్చినందుకు రాజ్తరుణ్ దాన్ని జాగ్రత్తగా కాపాడుకుని ఆ సినిమా అన్నా కనీసం హిట్ కొడితే బావుంటుందని అందరూ భావిస్తున్నారు. మరి ఈ విధంగా ప్లాన్ చెయ్యడానికి వరున్తేజ్ ఎందుకబ్బా వాళ్ళని రాజ్తరుణ్ కోసం ఒప్పించాడు అని అందరి ఆలోచన ఇటు మళ్ళింది.