కరోనా వైరస్ మహమ్మారిలా మానవ వినాశనాన్ని కోరుతూ కోరలు చాస్తుంటే ప్రమాదం అని తెలిసి కూడా లైట్ తీసుకోని `జాన్` సినిమా షూటింగ్ కోసం ప్రభాస్ జార్జియా వెళ్లిన విషయం తెలిసిందే. ఎంతో డేరింగ్ అండ్ డ్యాషింగ్తో వాళ్ళు అక్కడ షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకుని వచ్చారు. అక్కడ కరోనా కేసులు అధికం అవుతున్నా సరే మార్కెట్ సెట్లో కీలక సీన్లని, ఓ ఛేజింగ్ సీన్ని పూర్తి చేశారు ప్రభాస్ అండ్ కో. ప్రస్తుతం అందరూ బాహుబలి ఎక్కడ?.. ఏం చేస్తున్నారు అని ఫిల్మ్ సర్కిల్స్లోనూ, సామాన్య అభిమానుల్లోనూ వినిపిస్తున్న మాటిది.
ఇటీవలే ప్రత్యేక విమానంలో ఇండియాకి తిరిగి వచ్చిన ఆయన ప్రధానమంత్రి మోదీ చెప్పినట్లు గృహ నిర్భంధనలో బందీ అయ్యారు. అలాగే ఆయన హీరోయిన్ పూజా హెగ్డే కూడా అదే పనిలో ఉంది తను కూడా గృహనిర్భంధనలో ఉంది. వెళ్ళేటప్పుడు మాస్కులతో కనిపించి సంచలనం సృష్టించిన ప్రభాస్ వచ్చే ముందు మాత్రం ఎలాంటి హడావిడిని ప్రదర్శించలేదు. వచ్చామంటే దర్శకులు రాధాకృష్ణకుమార్ సోషల్ మీడియా ద్వారా ఒక ఫొటోని షేర్ చేసి విషయాన్ని ఫ్యాన్స్తో పంచుకున్నారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పరీక్షలు చేయించుకుని ఇంటికి తిరిగొచ్చిన ప్రభాస్ ఆ రోజు నుంచి మీడియాకు కనిపించకుండా పోయారు.
ఇంతకీ బాహుబలి ఎక్కడ అని అంతా వెతుకుతున్న వేళ తను సల్ఫ్ క్వారెంటైన్లోకి వెళ్లిపోయినట్టు ఓ వార్త బయటికి వచ్చింది. 14 రోజుల పాటు ప్రభాస్ బయటికి రాకుండా ఇంట్లోనే గడపాలని నిర్ణయించుకున్నారట. అంటే కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే ప్రభాస్ గృహ నిర్బంధన కాదు దాదాపు 14 రోజుల పాటు ఆయన సెల్ప్ క్వారెంటైన్లోకి వెళ్ళడం అన్నది హర్షించదగ్గ విషయం అని చెప్పాలి. ఒక హీరోగా తన బాధ్యతను తాను ఎంతో అద్భుతంగా నిర్వర్తిస్తున్నందుకు చాలా ఆనందంగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లతో హడావిడి చేస్తున్నారు.