‘అల వైకుంఠపుములో’ సినిమాతో తెలుగులో బంప‌ర్ హిట్ అందుకున్న ‘బుట్ట బొమ్మ’ పూజా హెగ్డే ఇప్పుడు బాలీవుడ్ పెద్ద ఛాన్స్ కొట్టేసింది. ఏకంగా కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్ సినిమాలో క‌థానాయిక‌గా అవ‌కాశం ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం. అయితే ఇప్పటికే సల్మాన్‌ఖాన్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం ‘కబీ ఈద్‌ కబీ దివాళీ’లో హీరోయిన్ న‌టిస్తున్న పూజాహెగ్డే త‌దుప‌రి సినిమాలో కూడా స‌ల్మాన్ స‌ర‌స‌న క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్లుగా తెలుస్తోంది. తాజాగా అక్షయ్‌ కుమార్‌ హీరోగా  ఫర్హాద్ షామ్జీ దర్శకత్వంలో వస్తున్న `బచ్చన్ పాండే`సినిమాలోనూ పూజా హీరోయిన్‌గా సెలక్ట్ చేసినట్టు సమాచారం. 

 

అయితే ఇందులో మెయిన్ హీరోయిన్‌గా కృతి సనన్ నటిస్తుండగా రెండో కథానాయికగా పూజాని ఎంపిక చేశారట. ఇటీవల ‘హౌజ్‌ఫుల్‌-4’ చిత్రంలో నటించిన పూజా బాలీవుడ్‌ జనాలను అలరించింది. ఇలా వ‌రుస సినిమాల‌తో బాలీవుడ్ సినీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్న ఈ బుట్ట‌బొమ్మ‌కు అవ‌కాశాలు వ‌రుస క‌డుతుండ‌టం విశేషం. ఇలా పెద్ద హీరోల ప‌క్క‌న అవ‌కాశాలు ద‌క్కుతుండ‌టంతో బాలీవుడ్లో  పూజాహెగ్డే క్రేజీ హీరోయిన్ కాబోతుందన్న టాక్ వినిపిస్తోంది. కాగా, తెలుగులో టాప్‌ హీరోయిన్‌ల‌లో ఒక‌రిగా కొనసాగుతున్న పూజా ప్రస్తుతం  ప్రభాస్‌ సరసన ‘జాన్‌', అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' చిత్రంలో నటిస్తోంది.

 

అలాగే ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇది ప్రభాస్‌కు 20వ చిత్రం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. క‌రోనాతో బ్రేక్ ప‌డింది. ప్రభాస్‌కి ‘బాహుబలి’ ఎంత మైలేజ్ ఇచ్చి పాన్ ఇండియా హీరోగా నిలబెట్టిందో.. ‘సాహో’ సినిమా ఆయనకు అంత నష్టం చేకూర్చింది. ‘సాహో’ సినిమా బాలీవుడ్‌లో హిట్ అయినా.. సౌత్‌లో మాత్రం డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమాకు ‘ఓ డియర్’, ‘రాధే శ్యామ్’ టైటిళ్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా బాలీవుడ్‌లో కూడా విడుద‌ల కానుండ‌టం విశేషం.  మ‌రి బుట్ట‌బొమ్మ‌తో జ‌త‌క‌డుతున్న ప్ర‌భాస్‌కు ఎలాంటి విజ‌యం ద‌క్కుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: