జబర్దస్త్ అండ్ రాజకీయం, రెండూ విభిన్నమైన అంశాలు. కానీ ఈ రెండిటినీ తన తెలివితో మేళవిస్తూ, అనుసంధానం చేస్తోంది మన అందాల వైస్సార్సీపీ mla రోజా గారు. ఒకే దెబ్బకు రెండూ పిట్టలన్నట్టు... ఇటు ఎంటర్టైన్మెంట్, అటు రాజకీయం రెండూ అయిపోతున్నాయి. అవునండి. సందర్భానుసారం.. ఆమె తన పార్టీ ప్రసారాన్ని కానిచ్చేస్తోంది మరి. అవును... ఓ వైపు జబర్దస్త్‌లో నవ్వుతూనే మధ్యలో తన పార్టీ ప్రచారం కూడా చేసుకుంటుంది రోజా. 

 

అడపా దడపా నవ్వుల్లో భాగంగా.. పంచ్ డైలాగులు వేస్తూ.. మధ్యలో రాజకీయాల గురించి కూడా చర్చకు తీసుకొస్తుంది. ఇప్పుడు కూడా అదే చేసింది మన అందాల రోజమ్మ. తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో తన పార్టీ ప్రచారంతో పాటు జగన్ భజన కూడా చేసిన వైఖరి మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక అది పెద్ద తప్పేం కాదు అన్నట్లుగా కొట్టి పారేస్తున్నారు... మన నెటిజన్లు. తన పార్టీకి తాను ప్రచారం చేసుకుంటుంది.. కావాలని కాదు సుమా.... ఏదో అలా మధ్యలో కామెడీ చేస్తూ తన పార్టీ గురించి చెప్పుకుంటుంది.. అంతే కదా అంటున్నారు. 

 

ఇక అసలు విషయానికి వస్తే.. హైపర్ ఆది, స్కిట్‌లో భాగంగా.. ఓ పంచ్ డైలాగ్ వేసాడు. అదేమంటే.. "గత వారం విజేతలుగా నిలిచిన ఆరుగురు టీం లీడర్లు.. పంచుకున్న తర్వాత వచ్చింది ప్రైజ్ మనీయా.. లేక  పెన్షనా అర్థం కాక అయోమయం.." అంటూ ఓ డైలాగ్ వేసాడు. వెంటనే రోజా అందుకుని.. పెన్షన్ అయితే కచ్చితంగా అంతకంటే ఎక్కువే వస్తుందంటూ తన పార్టీ ఇస్తున్న పెన్షన్స్ గురించి డైరెక్టుగా కాకుండా ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చింది.  

 

మనం ఇచ్చే ప్రైజ్ మనీ కంటే కూడా... పెన్షన్ కొంచెం ఎక్కువగానే వస్తుంది అంటూ ఆమె వేసిన పంచ్ ఇటు హాస్యానికి, అటు రాజకీయానికి సరిగ్గా సరిపోయింది. ఎవరో చెప్పినట్లు.. స్వామికార్యం స్వకార్యం రెండూ ఒక దెబ్బకు జరిగిపోయాయి.. అంటూ కొందరు నెటిజన్లు ఆమెను తెగ పొగిడేస్తున్నారు. హైపర్ ఆది డైలాగుకు పంచ్ వేసినట్లుంది అంటూ రోజా చమత్కారానికి నవ్వుకుంటున్నారు ఆమె అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: