హోమ్లీ ఇమేజ్ తో ఆకట్టుకున్న కోలీవుడ్ అందాల భామలు శ్రీ దివ్య, లక్ష్మీ మీనన్. కెరీర్ స్టార్టింగ్ లో మంచి ఫాంలో కనిపించిన ఈ ముద్దుగుమ్మలకు తరువాత కెరీర్ లో బిగ్ బ్రేక్ వచ్చింది. స్టార్ ఇమేజ్ అందుకుంటారని ఫ్యాన్స్ భావించినా వరుస ఫ్లాప్ లు ఎదురు కావటంతో అవకాశాలు తగ్గిపోయాయి. కొంత కాలంగా వెండితెరకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మలు త్వరలో ఒకే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
సీనియర్ నటుడు ప్రభు వారసుడిగా కోలీవుడ్ కు పరిచయం అయిన నటుడు విక్రమ్ ప్రభు. ఈ యువ నటుడు హీరోగా సుశీంద్రన్ దర్శకత్వంలో నల్లు సామి పిక్చర్స్ బ్యానర్ పై ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా లో శ్రీ దివ్య, లక్ష్మీ మీనన్ లు హీరోయిన్లుగా నటించనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అంతేకాదు ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మలు గ్లామర్ రోల్స్ లో కనిపించనున్నారట.
తెలుగు సినిమా మనసారాతో హీరోయిన్గా పరిచయం అయిన శ్రీదివ్య తరువాత వరుసగా తెలుగు సినిమాలతో ఆకట్టుకుంది. కానీ స్టార్ ఇమేజ్ దక్కకపోవటంతో కోలీవుడ్ బాట పట్టిన ఈ భామ అక్కడ కూడా ఆకట్టుకుంది. 2017లో చివరగా నటించిన శ్రీ దివ్య తరువాత బ్రేక్ తీసుకుంది. మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్గా పరిచయం అయిన లక్ష్మీ మీనన్ తరువాత కోలీవుడ్ లో అడుగు పెట్టి సక్సెస్ అయ్యింది. 2016లో చివరగా రేఖ సినిమాలో నటించిన ఈ భామ తరువాత వెండితెరకు దూరంగా ఉంది, ఇప్పడు విక్రమ్ ప్రభు, సుశీంద్రన్ సినిమాతో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. లాంగ్ బ్రేక్ తరువాత ఇద్దరు భామలు ఒకే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుండటంతో ఈ మూవీ ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.