టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం పూజా హెగ్డే టైం నడుస్తుంది. వరుసపెట్టి విజయాలు దక్కించుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం క్షణం ఖాళీ లేకుండా టాప్ హీరోల సినిమాలలో నటిస్తూ వస్తుంది. ఈ ఏడాది ఆరంభంలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన 'అలా వైకుంఠపురం లో' సినిమాలో హీరోయిన్ గా చేసి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా పూజా హెగ్డే తన కెరీర్లోనే బెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాగా సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ప్రభాస్ తో 'జాన్' అనే వర్కింగ్ టైటిల్ కలిగిన సినిమాలో నటిస్తోంది. ఇదే కాకుండా అక్కినేని అఖిల్ హీరోగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అనే సినిమాలో కూడా నటిస్తోంది.

 

ఇటువంటి తరుణంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకొంది. అంతేకాకుండా సల్మాన్ ఖాన్ సినిమా లో కూడా చాన్స్ అందుకోవడం జరిగింది. ఇలా ఒక పక్క సౌత్ ఇండస్ట్రీలో మరో పక్క బాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే అవకాశాలు అందుకుంటున్న ఈ భామ మరో జాక్ పాట్ కొట్టేసిందని తెలుస్తోంది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనూ పూజా రొమాన్స్ కి సిద్ధమవుతోందని తెలుస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రంలో హీరోయిన్ గా పూజా పేరును పరిశీలిస్తున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ `వకీల్ సాబ్` అనే సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో బందిపోటు పాత్రలో ఒక కొత్త సినిమా చేస్తున్నాడు.

 

రెండు అయిన వెంటనే హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా కన్ఫర్మ్ అయినట్లు వార్తలు రావడం జరిగింది. దీంతో అనవసరంగా పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్లు... పూజా హెగ్డే ని హీరోయిన్ గా పెట్టి రిస్కు తీసుకుంటున్నారని అభిమానులు అంటున్నారు. మా హీరోకి పొలిటికల్ మీటింగ్స్ ఎప్పుడు ఉంటాయో తెలియదు...మరో పక్క ఆమె స్టార్ హీరోయిన్, ఆమె డేట్స్ సరిగ్గా మ్యాచ్ అవ్వకపోతే సినిమా ప్రాజెక్టు కి డ్యామేజ్ అవుతుందని సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: