ఇండస్ట్రీలో ఒక్కొక్కరికీ ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి కూడా ఓ సెంటిమెంట్ ఉంది. తన ఫేవరేట్ ప్లేస్ కు కథ రాస్తే సినిమా సూపర్ హిట్టే అని ఈ డైరెక్టర్ నమ్మకం. ఇప్పుడు తన ఫేవరేట్ ప్లేస్ కు వెళ్లి అనిల్ రావిపూడి సూపర్ హిట్ సీక్వెల్ కు స్టోరీ ప్రిపేర్ చేస్తున్నాడట. క్రేజీ స్టార్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ దర్శకుడు వండర్ ఫుల్ సీన్స్ ప్రిపేర్ చేస్తున్నట్టు టాక్. 

 

యువ దర్శకుడు అనిల్ రావిపూడి వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. రాజమౌళి, కొరటాల శివ తర్వాత ఫ్లాప్ అనేదే లేని డైరెక్టర్ గా పేరు తెచ్చుకుంటున్నాడు. లాస్ట్ ఇయర్ ఎఫ్ 2తో ఇండస్ట్రీ నెంబర్ వన్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి ఈ ఏడాది మహేశ్ బాబుతో సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ తీశాడు. ఈ యువ దర్శకుడు తనతో వర్క్ చేసిన ప్రతి హీరోకు కెరీర్ బెస్ట్ సక్సెస్ ఇస్తున్నాడు. ఇలాంటి యంగ్ డైరెక్టర్ కు ఓ సెంటిమెంట్ ఉంది. 

 

అనిల్ రావిపూడి సినిమాలో కామెడి హైలెట్ గా నిలిచిన యాక్షన్ సీన్స్ కూడా హై ఓల్టేజ్ లోనే ఉంటాయి. పటాస్, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరులోని యాక్షన్ సీన్స్ ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. కరోనా ఎఫెక్ట్ తో ఖాళీ సమయం దొరికిన ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు ఎఫ్ 2 సీక్వెల్ కథ రాయడంలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ముగ్గురు క్రేజీ స్టార్స్ ని మైండ్ లో పెట్టుకొని అనిల్ రావిపూడి ఈ సీక్వెల్ కథ ప్రిపేర్ చేస్తున్నట్టు వినికిడి. 

 

ఎఫ్ 2 సీక్వెల్ కథ రాయడానికి అనిల్ రావిపూడి వైజాగ్ వెళ్లినట్టు తెలుస్తోంది. సముద్రానికి ఎదురుగా ఉన్న తన ఫ్లాట్ లో కూర్చొని కథలు రాసుకోవడం ఈ దర్శకుడికి సక్సెస్ సెంటిమెంట్ గా మారిందట. ఎఫ్ 2 సీక్వెల్ ని వెంకటేశ్, వరుణ్ తేజ్, రవితేజను దృష్టిలో పెట్టుకొని రాస్తున్నాడని.. లేదు మహేశ్ బాబు, వెంకటేశ్, రవితేజను మనసులో పెట్టుకొని రాస్తున్నాడని రకరకాలుగా వినిపిస్తోంది. మరి ఇందులో ఏది నిజమనేది అనిల్ రావిపూడి చెప్తే కానీ తెలియదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: