సూపర్ స్టార్ మహేష్ బాబు మీద ఇప్పుడు ఒత్తిడి బాగా పెరిగిందట. అది కూడా సినిమా విషయంలో. ఒక సినిమాని కమిటయ్యాడని అయితే ఆ సినిమా విషయంలోనే అని సమాచారం. గీత గోవిందం లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు పరుశురామ్ తో సినిమా చేయాలని మహేష్ బాబు అనుకున్నారట. అయితే ఆ సినిమాను మైత్రీ మూవీస్ లో నిర్మించాలన్న ప్రతిపాదనని మహేష్ భార్య నమ్రత భావించినట్లు ఇంతకముందు ఫిల్మ్ నగర్ లో న్యూస్ బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. 

 

అయితే అప్పటికే దర్శకుడు పరుశురామ్ ఓ సినిమాను 14రీల్స్ కు కమిట్ అయ్యాడు. అంతేకాదు అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేసారు. తమ అడ్వాన్స్ మేరకు తమకు సినిమా చేయాల్సిందే అని మైత్రీ మూవీస్, తమను వదిలి ఎలా వెళ్తారని 14రీల్స్ మేకర్స్ పరుశురామ్ ని గట్టిగా పట్టుకున్నారు. దాంతో ఇప్పుడు మహేష్ బాబు కి పెద్ద చిక్కొచ్చి పడింది.

 

మరో పక్క ఈ విషయంలో 14రీల్స్ మేకర్స్ డైరక్టర్ తో కాంప్రమైజ్ కావడం లేదట. అలానే ఒకవైపు మైత్రీ వాళ్ళు తమతో సినిమా చేయాలని ప్రపోజల్ నుండి డ్రాపవడం లేదు. దాంతో రెండు నిర్మాణ సంస్థలు కలిసి మహేష్ బాబు - పరశురాం తో సినిమా చేసేలా మహేష్ డిసైడయ్యాడని లేటెస్ట్ న్యూస్. అదే గనక జరిగితే ఇక్కడ రెండు అగ్ర నిర్మాణ సంస్థలు కలిసి సూపర్ స్టార్ తో సినిమా చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక మహేష్ బాబు మే రెండవ వారం నుండి మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ మల్టిస్టారర్ లో జాయిన్ అవుతాడు. ఈ సినిమాకి మేష్ బాబు 40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది.
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: