బాలీవుడ్ లో ఎలాంటి వాళ్ళ మీదైనా సంచలన వ్యాఖ్యలు చేయడంలో కంగన సిస్టర్స్ అందరికంటే ముందుంటారన్న సంగతి తెలిసందే. ఎలాంటి విషయాన్ని నిర్మొహమాటంగా మాట్లాడుతుంది. అవతల ఉన్న వ్యక్తి ఎంత పెద్ద వాళ్ళైనా కంగన కి అనవసరం. తప్పు చేస్తే తుప్పు వదలగొడుతుంది కంగన. ఈ నేపథ్యంలోనే దిల్లీ నిర్భయ దోషులకు సంబంధించి కంగన చేసిన కామెంట్స్ అందరికి షాకిచ్చాయి. ఇటీవల నిర్భయ దోషులను ఉరి తీసిన సంగతి తెలిసిందే. అయితే ఉరి తీసిన నలుగురు దోషుల పేర్లతో స్మారకాలు నిర్మించాలని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అత్యాచారాలకు తెగబడే వారిని.. యాసిడ్ దాడులు చేసే మృగాళ్ళని ఈ సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించదని ఈ స్మారకాల ద్వారా తెలియజేయాలని కంగన వ్యాఖ్యలు చేసింది. అయితే దోషులకు సంబంధించిన స్మారకాలు నిర్మించాలని కంగన చేసిన కామెంట్స్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

 

అయితే ఇలా కంగన చేసిన ఈ కామెంట్స్ కి నెటిజన్స్ రివర్స్ లో కంగన ని ఏకిపారేస్తున్నారు. 2012 డిసెంబర్ 16న బస్సులో కొంత మంది దుర్మార్గులు నిర్భయ పై అత్యంత క్రూరంగా అత్యాచారం చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ దారుణమైన ఘటన భారత దేశం మొత్తం సంచలనం సృష్టించింది. దీనిపై యావత్ భారతదేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు కారణమైన దోషులకు ఉరిశిక్ష వేయాలని నిరసన తెలిపిన వాళ్ళలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా ఉన్నారు. 

 

కంగన మాటల్లో ఆవేశాన్ని సంచలన వ్యాఖ్యల ద్వారా తెలిపింది. ఆ నలుగురి దోషుల స్మారకాలు కట్టాలి అని కోరేంత కసిని మృగాళ్లపై పెంచుకోవడం ఒకటైతే తన సోదరి రంగోలికి జరిగిన అన్యాయం పురుషాధిక్య ప్రపంచంపై దండయాత్రగా మారిన వైనం కావచ్చు. మొత్తానికి దుర్మార్గులకు స్మారకం కడితే వీడు దుర్మార్గుడు అని తెలుస్తుంది కదా! అందుకే అలా కంగన వ్యాఖ్యలు చేశారు అని అర్థం చేసుకున్నప్పటికి.. ఈ వ్యాఖ్యలు కొంతమంది సమర్ధించడం లేదు. తిరిగి కంగన మీద మీరు చేస్తున్న కామెంట్స్ ఎంతమాత్రం సరైనవి కాదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: