కరోనా వైరస్ ఎక్కువ కాకూడదనే కారణంతో ప్రధాని మోడీ ఆదివారం జనతా కర్ఫ్యూ కు పిలుపునిచ్చారు. దేశమంతా ఈ కర్ఫ్యూలో పాల్గొని జనతా కర్ఫ్యూని విజయవంతం చేసింది. తెలంగాణా, ఆంధ్రాలో జనాలు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇక స్టార్స్ కూడా తమ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇంట్లోనే ఉంటూ తమ వర్క్ అవుట్స్ చేశారు. అయితే 5 గంటలకు కరోనాని తరిమికొట్టేందుకు కష్టపడుతున్న డాక్టర్స్ కు థ్యాంక్స్ చెబుతూ క్లాప్స్ కొట్టమని చెప్పారు ప్రధాని మోడీ.  సిని సెలబ్రిటీస్ అందరు తమ తమ ఇళ్లలో బాల్కానీలకు వచ్చి క్లాప్స్, గంటలు, ప్లేట్ తో గంటె తీసుకుని కొట్టి తమ స్పందన తెలియచేశారు. 

 

కొందరు సెలబ్రిటీస్ మాత్రం ఇంట్లో జిమ్, గేమ్స్ ఇలా చేస్తూ ఉన్నారు. వీళ్ళలో యువ హీరో నాగ శౌర్య మాత్రం వెరైటీ కొత్త ఆవకాయ పచ్చడి పెట్టడం విశేషం. అమ్మకు సహకరిస్తూ నాగ శౌర్య స్వయంనిగా పచ్చడి కలపడం భలే అనిపించింది. తానో హీరో కదా ఇవన్నీ చేయొచ్చా అన్న దౌట్లేమీ పెట్టుకోకుండా ఊరగాయని కలుపుతూ ఎంచక్కా ఆ వీడియో తన సోషల్ బ్లాగ్స్ లో పెట్టాడు నాగ శౌర్య. ఈ కాలం యువ హీరో పచ్చడి కలపడం చూసి అందరు షాక్ అవుతున్నారు. ఇంకా మామిడి కాయలు మార్కెట్ లోకి రానే రాలేదు అప్పుడే బాబు పచ్చడి పెట్టేశాడే అంటూ కొందరు సెటైర్స్ వేస్తున్నారు. 

 

ఏది ఏమైనా నాగ శౌర్య తాను చేసిన పచ్చడి వీడియో తీసి సోషల్ బ్లాగ్స్ లో పెట్టి ఇంటి దగ్గర అమ్మకు సహకరిస్తున్నట్టుగా చెప్పుకొచ్చాడు. నిజంగా ఇది మంచి విషయమే అని చెప్పాలి. ఎప్పుడు షూటింగ్స్, షెడ్యూల్ అంటూ బిజీగా ఉండే హీరో ఇంటి దగ్గర అమ్మకు సాయంగా ఉండటం మంచి విషయమే. ఇక సినిమా విషయానికి వస్తే నాగ శౌర్య రీసెంట్ మూవీ అశ్వద్ధామ ఫ్లాప్ అవగా నందిని రెడ్డి డైరక్షన్ లో ఈ యువ హీరో ఒక సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: