ఎప్పుడూ షూటింగ్ లోకేషన్‌లో బిజీగా ఉండే తారలు కరోనా ఎఫెక్ట్‌ తో ఇంటికే పరిమిత మయ్యారు. ప్రపంచ గతంలో ఎన్నడూ చూడని విపత్తును ఎదుర్కొంటున్న తరుణంలో తమ వంతు బాధ్యతగా సెల్ఫ్ సోషల్ డిస్టాన్సింగ్‌ కు మద్దతుగా నిలుస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో మన ఫెవరెట్ స్టార్స్‌ ఏం చేస్తుంటారు. ఖాళీగా ఇంటి దగ్గర ఉన్న తారలు ఎలా కాలం గడుపుతారు అన్న విషయం తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఆసక్తికనబరుస్తుంటారు.

 

అందుకే తమ అభిమానుల కోసం తమ క్వారెంటైన్‌ ముచ్చట్లను సోషల్ మీడియా వేదిక అభిమానులతో పంచుకుంటున్నారు తారలు. ఈ సందర్భంగా ఒకప్పటి హీరోయిన్‌ కరీష్మా కపూర్‌ తన ఇంటి బాల్కనీలో ఖాళీగా కూర్చున్న ఫోటో దిగి పోస్ట్ చేసింది. ఫోటోతో పాటు మీరంతా ఆందోళనలో ఉన్నారు. అయితే ఈ లోకంలో మీరు మాత్రమే కాదు. మనమంతా కలిసే ఉన్నాం. అధైర్య పడవద్దు` అంటూ కామెంట్ చేసింది కరీష్మా. ఆమె చెల్లెలు కరీనా కూడా ఇంట్రస్టింగ ఫోటోను పోస్ట్ చేసింది. తన చిన్ననాటి ఫోటోను పోస్ట్ చేసి కరీనా `ఎవరో దగ్గరికి వస్తుంటే వద్దంటున్నా కదా.. కరోనా టైమ్ కు ఇదే పర్ఫెక్ట్ ఫోటో` అంటూ కామెంట్ చేసింది.

 

క్యూట్ భామ అలియా భట్ ప్రస్తుతం తాను చదువుతున్న బుక్‌ ఫోటోను పెట్టి `ఇంట్లో ఉండి ఈ బుక్‌ చదవటం పూర్తి చేయాలి` అని కామెంట్ చేసింది. టాలెంటెడ్ స్టార్‌ ఆయుష్మాన్‌ ఖురానా తనలోని ఆర్టిస్ట్‌ ను బయటకు తెచ్చాడు. రకారకాల బొమ్మలు వేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. ఈ ఫోటోలో పాటు ` మన టాలెంట్ అంతా చూపిద్దాం..  కరోనాతో పోరాదాం` అంటూ కామెంట్ చేశాడు. ఇక బాలీవుడ్ కిలాడీ ఇంట్లోనే ఉండి తన కూతురితో కలిసి అల్లరి చేస్తున్నాడు. దీంతో ఆయన భార్య ట్వింకిల్‌ ఖన్నా తాను రాస్తున్న పుస్తకం పూర్తి చేయలేకపోతున్నా అని సరదాగా కామెంట్ చేసింది. ఇక అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్‌ కూడా ఆర్టిస్ట్‌గా మారిపోయింది. తనలోని టాలెంట్‌ ను చూపిస్తూ రంగులతో బొమ్మలు గీసేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: