కరోనా ఎక్కువ కాకుండా ప్రధాని మోడీ పిలుపు మేరకు ఆదివారం దేశమంతా జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు. ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండే రోడ్లన్నీ నిర్మానుషంగా మారాయి. ఇంట్లో ఉండి అమెజాన్, నెట్ ఫ్లిక్స్ తో పాటుగా టీవీల్లో వచ్చే ప్రోగ్రామ్స్ చూసుకుంటూ సరదాగా గడిపారు. అయితే నిన్న జరిగిన జనతా కర్ఫ్యూ వల్ల ఎక్కువ క్యాష్ చేసుకుంది మాత్రం జీ తెలుగు వాళ్ళే అని చెప్పాలి. జీ తెలుగులో బాబుగారింట్లో బుట్ట భోజనం అంటూ ఒక షో నిన్న టెలికాస్ట్ చేశారు. అసలైతే అది ఉగాది రోజు టెలికాస్ట్ చేయాల్సింది కానీ నిన్న కర్ఫ్యూ ఉండటం వల్ల అందరు ఇళ్లలో ఉంటారు కాబట్టి ఆదివారమే ఈ షో ప్లాన్ చేశారు.

 

జీ తెలుగులో వచ్చిన బాబు గారింట్లో బుట్ట భోజనం ఎపిసోడ్ సూపర్ హిట్ అయ్యిందని చెప్పొచ్చు. తరుణ్ భాస్కర్, నాగబాబుతో పాటుగా ప్రదీప్, అనసూయ, రవి, అదిరింది టీమ్ ఇలా అందరు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. అంతేకాదు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిహారిక.. స్పెషల్ గెస్ట్ గా స్వీటీ అనుష్క కూడా ఈ షోలో పాల్గొన్నారు. రవి, ప్రదీప్ లు రెండు టీమ్ లుగా ఏర్పడి ఈ షో నడిపించారు. ఫైనల్ గా గెలిచినా టీమ్ ఓడిపోయినా టీమ్ కు బుట్ట భోజనం వడ్డించాలన్న కండీషన్ పెట్టారు నాగబాబు. అదిరింది గల్లీ బాయ్స్, చమ్మక్ చంద్ర జానీ మాస్టర్ స్కిట్, వేణు, శివ శంకర్ మాస్టర్ స్కిట్, నిహారిక స్పెషల్ స్కిట్ ఇలా షో అంతా నవ్వులు పూయించింది.

 

కరెక్ట్ టైంలో కరెక్ట్ షో ప్లాన్ చేశారు జీ తెలుగు నిర్వాహకులు. ఉగాది రోజు ఎలాగూ ఈటీవీలో షో ఉంది.. పండగ సార్ పండుగ అంతే షో మీద ఆడియెన్స్ దృష్టి ఉంటుంది. అందుకే ఆదివారం ఈ జీ తెలుగులో టెలికాస్ట్ చేశారు. ఈ షోకి కచ్చితంగా మంచి టిఆర్పి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇంట్లో ఉన్న ఆడియెన్స్ ను మంచి ఎంటర్టైన్ అందించిన జీ తెలుగు ఉగాది రోజు ఎలాంటి సర్ ప్రయిజ్ ఇస్తుందో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: