కరోనా అంటే ఇప్పుడు కిలో మీటర్ దూరం ఉరుకుతున్నారు.  కరోనా వైరస్ ఉందని తెలిస్తే ఆ పరిసర ప్రాంతాలకు వెళ్లాలంటే ఒక్క డాక్టర్ తప్ప ఐనవాళ్లు కూడా దూరంగా ఉంటుంన్నారు.  కరోనా ప్రభావం వల్ల ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు.  చైనా నుంచి వచ్చిన ఈ దిక్కుమాలిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తుంది. చుట్టడమే కాదు.. పిట్టాల్లో రాలిపోతున్నారు.  చైనా తర్వాత ఇటలీ, ఫ్రాన్స్ దారుణమై మరణాలు సంబవిస్తున్నాయి.  అందమైన దేశాలు ఇప్పుడు కన్నీటి పర్యంతం అవుతున్నాయి.  కరోనా ఎఫెక్ట్ తో సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు సైతం అన్ని క్లోజ్ చేసుకొని ఇంటిపట్టునే ఉంటున్నారు.  

 

తాజాగా కరోనా ఎఫెక్ట్ తో ఇప్పుడు ఓ సినీ నటికి కంటిమీద కునుకు లేకుండా ఉందని.. తమ కుటుంబాన్ని ఘోరంగా అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంది.  లండన్ నుంచి వచ్చి, కరోనా వైరస్ బారిన పడ్డ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కుటుంబీకులు వైద్య శాఖ అధికారులు తమను నీచంగా చూశారని సంచలన ఆరోపణలు చేశారు. మెడికల్ రిపోర్టులో 28 అని రాశారని, ఆమెను పురుషునిగా పేర్కొన్నారని ఆరోపించారు. పరీక్షల రిపోర్టు మీడియా ముందుకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. వైరస్ బారిన పడిన వారి వివరాలను రహస్యంగా ఉంచుతూ, కనిక వివరాలు ఎందుకు బహిర్గతం చేశారని మండిపడ్డారు.  

 

ఇప్పుడు సొసైటీలో తమను ఓ దోషిలా చూస్తున్నారు. కాగా, కనికా కపూర్ ఇచ్చిన పార్టీకి పలువురు సెలబ్రిటీలు, ఎంపీలు హాజరైన సంగతి తెలిసిందే. వీరంతా ఇప్పుడు సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లారు. ఆమెతో టచ్‌ లో ఉన్న 53 మంది అనుమానితులలో 11 మందికి నెగిటివ్ రిపోర్టు రాగా, మిగిలినవారి రిపోర్టులు రావాల్సి వుంది. మరోవైపు కరోనా ప్రభావంతో నిన్న జనతా కర్ఫ్యూ దిగ్విజయంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే. 5 గంటలకు అందరూ బయటకు వచ్చి చప్పట్లు కొట్టి సంఘీభావం ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: