సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ఉప్పెన. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. మొదట్లో ఈ సినిమా గురించి పెద్దగా ఎవరికీ ఆసక్తి లేదు.

 

 

కానీ ఈ సినిమా నుండి ఒక్కో అప్డేట్ బయటకి వస్తున్నప్పటి నుండి ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ఆ ఆసక్తి ఒక్కసారిగా అమాంతం పెంచేసిన వాళ్ళలో ముఖ్యపాత్ర పోషించింది హీరోయిన్ కృతి శెట్టి. ధక్ ధక్ ధక్ అనే పాట విడుదల అయినప్పటి నుండి ఈ సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. నిమిషంన్నర పాటు ఉన్న ఈ వీడియో సాంగ్ లో కృతి హావాభావాలు అద్భుతంగా ఉంటాయి.

 

 

ధక్ ధక్ అన్నప్పుడల్లా ఆమె చూసే చూపులు, నవ్వులు మన గుండెల్లో గుచ్చుకుంటాయి. కేవలం హీరోయిన్ కోసమే సినిమా చూద్దాం అనుకునే వాళ్ళు పెరిగిపోయారు. అంతలా మెస్మరైజ్ చేసింది కృతి. అయితే ఈ అమ్మడు కి ప్రస్తుతం మరో అద్భుత అవకాశం వచ్చిందని టాక్ వినిపిస్తోంది. సుకుమార్ రాసిన కథ 18 పేజీల్లో హీరోయిన్ గా కృతికే అవకాశం వచ్చిందని అంటున్నారు.

 

 

పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ హీరోగా నటిస్తుండగా కృతిని హీరోయిన్ గా సెలెక్ట్ చేసారని టాక్. ధక్ ధక్ ధక్ అనే పాటని వచ్చిన స్పందన ఆధారంగానే ఈ అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది. మొత్తానికి కృతి ఉప్పెన సినిమా విడుదల అవకముందే టాలీవుడ్ లోకి ఉప్పెనలా దూసుకువస్తోందని చెప్పవచ్చు.

 

 

 

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: