జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్ గా చేరి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం తెలుగు యాంకరింగ్ రంగంలో రెండో స్థానంలో రాణిస్తోంది. ఇటు సినిమాలో కూడా నటిస్తూ మరోవైపు ఈవెంట్స్ అంటూ షాపింగ్ ఓపెనింగ్స్ అంటూ రెండు చేతులా లక్షల రూపాయలను అలవోకగా సంపాదిస్తుంది. అయితే ఈమె తాజాగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాస్త సవరించండి లేకపోతే మేము కరెంట్ బిల్లులు, ఈఎంఐలు ఎలా కట్టుకోవాలి? అని ప్రశ్నించింది. అయితే కోటి రూపాయల కారులో దర్జాగా తిరుగుతూ నెలకి లక్షలు రూపాయలు సంపాదించే నువ్వు కరెంట్ బిల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్నావా తల్లీ? అంటూ ఆమెపై తెలుగు నెటిజన్లు దుమ్మెత్తిపోశారు.



అయితే అనసూయ మళ్లీ సామాజిక మాధ్యమాలలో వ్యాఖ్యలు చేస్తూ... 'నిన్నట్నుంచి ఇన్‌స్టాలో వెధవలు అకౌంట్లు బ్లాక్ చేసి చేసి వేళ్ళు నొప్పెడుతున్నాయంటే నమ్మండి. తప్పదు కదా. నా పేజ్ లో వాళ్ళ బుర్రా లేనితనం ఏంటీ? నా శాంతి నా బాధ్యత. నన్నర్థం చేసుకొని వాళ్ళని నేను ఎందుకు అర్థం చేసుకోవాలి? అందుకే నన్ను అర్ధం చేసుకొని వాళ్ళకి దూరంగా ఉంటూ వాళ్ళకి నేను హెల్ప్ చేస్తూ అకౌంట్స్ ని బ్లాక్ చేసి పడేస్తున్నాను' అని ఒక పోస్ట్ లో పేర్కొంది.



మరొక పోస్టు లో... 'అయ్యబాబోయ్‌!! ఏంటి ఇంతమందా!! ఇంత మంది బుర్రలేనివాళ్లా.. ఇంతమంది వితండవాదులా!! ‘మేము’ అంటే ‘నేను’ అని అర్థం చేసుకుని.. ఏంచేస్తాంలేండి.. కామన్స్‌ సెన్స్‌ ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. రాబోయే రోజుల్లో అర్థం చేసుకునేవాళ్ల గురించి నేను భయపడుతున్నా', అంటూ పేర్కొంది.



అయితే చాలామంది నెటిజనులు నీకే బుర్ర లేదు, అనసూయ! ఇటువంటి పరిస్థితుల్లో కూడా వర్క్ చేసి డబ్బు సంపాదించాలనే ఆశతో ఉన్నావు. ముందు నువ్వు వెళ్లి ఏదైనా సైకియాట్రిస్ట్ కి చూపించుకో అంటూ తీవ్ర స్థాయిలో ఆమెపై విరుచుకుపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: