దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కఠిన నిబంధనలు అమలులోకి తీసుకు వస్తున్నాయి. ఇప్పటికే దేశ ప్రజలు అందరూ ఎక్కడ గుమిగూడ కుండా  ఉండేందుకు విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్, పబ్లిక్ ప్లేస్ లు అన్ని  మూసివేస్తూ  నిర్ణయం తీసుకున్నాయి  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక కొన్ని రాష్ట్రాల్లో అయితే ముందు జాగ్రత్తలు దృశ్య ఏకంగా లాక్ డౌన్  ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది ప్రాణాంతకమైన మహమ్మారి వైరస్ ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కువగానే ఉన్న నేపథ్యంలో... తెలంగాణ రాష్ట్రంలో కూడా లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో ప్రజలెవరూ ఇల్లు గడప దాటి కాలు బయట పెట్టకూడదు అంటూ సూచించారు. 

 

 

 ఇక రవాణా వ్యవస్థ మొత్తం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. బయటకి వెళ్దామా అన్న ప్రజలకు ఏమీ దొరకని పరిస్థితి. అన్ని షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, దుకాణాలు, పార్కులు, పబ్బులు ఇలా అన్ని మూతపడ్డాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తుంటే... కొందరు మాత్రం పరిస్థితి అర్థం చేసుకోకుండా ఇంకా బాహ్య ప్రపంచంలోకి వస్తూ కరోనా వైరస్ వ్యాప్తికి కారణం అవుతున్నారు. ప్రభుత్వాలు హెచ్చరిస్తునప్పటికీ కొంతమంది మాత్రం లెక్క చేయడం లేదు. ఇక ఇంకొంతమంది మార్చి 31 వరకు లాక్ డౌన్  ప్రకటించిన నేపథ్యంలో పరిస్థితి ఎలా అనే అయోమయంలో ఉన్నారు. ఓ వైపు కరోనా వైరస్ నుంచి ప్రాణాలు కాపాడుకోవడం... మరోవైపు ఇంట్లో అత్యవసర సరుకులు సరిపెట్టుకోవడం ఎలా అనే ఆందోళన చెందుతున్నారు. 

 

 

 ఇలా ఆందోళన చెందుతున్న వారికి టాలీవుడ్ దర్శకురాలు నందిని రెడ్డి ఒక మంచి సలహా ఇచ్చారు. కరోనా  వైరస్, లాక్ డౌన్  పరిస్థితులను ఎదుర్కోవడానికి ఒక మంత్రం ఉంది అంటూ సోషల్ మీడియా వేదికగా నందిని రెడ్డి తెలిపారు. రోజుకు కేవలం ఒక్కసారి మాత్రమే తినండి... ఇలా రోజుకు ఒక్కసారి మాత్రమే తినడం వల్ల నిత్యావసర వస్తువులు ఎక్కువ కాలం రావడమే కాకుండా... ఉపవాసం రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రజలందరికీ ఒక సూచన చేశారు దర్శకురాలు నందిని రెడ్డి. ఇక నందిని రెడ్డి చేసిన పోస్ట్ పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు రకరకాలుగా రిప్లై ఇస్తున్నారు. కొందరు మంచి సజెషన్ మేడం అని కామెంట్ పెడుతుంటే.. ఉపవాసం ఉండడం వల్ల మరింత వీక్ అయిపోతాము  మేడం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: