జబర్దస్త్ యాంకర్ అనసూయ ఒకపక్క సినిమా రంగంలో మరోపక్క బుల్లితెరపై సక్సెస్ ఫుల్ గా రాణిస్తోంది. రంగస్థలం సినిమాలో రంగమ్మ అత్త పాత్రల్లో అదరగొట్టిన అనసూయ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న సినిమాలో కూడా నటిస్తోంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు ఎప్పటికప్పుడు తాను నటించే సినిమాల గురించి, అలాగే సమాజంలో అనేక విషయాల గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అంతేకాకుండా తన హాట్ హాట్ అందాలతో పిచ్చెక్కించే ఫోటో షూట్ లతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్ పెంచుకుంటూ పోతుంది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో అనసూయ చేసిన ఒక కామెంట్ వైరల్ గా మారి..నెటిజన్ల చేత తిట్లు తిట్టించుకుంటుంది. పూర్తి వివరాల్లోకి వెళితే కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ లాక్ ఔట్ ప్రకటించిన విషయం తెల్సిందే.

 

అత్యవసర సేవలు మినహా అన్ని బంద్ చేయాల్సిందే అంటూ ప్రకటించిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో స్పందిస్తూ సీఎం కేసీఆర్ గారు చెప్పింది పాటించాలని చెబుతూ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏంటీ అనే విషయమై ఆయన పోస్ట్ చేశాడు. కేటీఆర్ చేసిన పోస్ట్ కు అనసూయ రిప్లై చేసింది. ఏమనంటే...కొన్ని ప్రొఫెషనల్ రంగాలకు సంబంధించి గవర్నమెంట్ ఆలోచిస్తే బాగుంటుంది అని నిబంధనలు సడలించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. మేము పని చేస్తేనే డబ్బులు వస్తాయి ఇంటి రెంటు కట్టాల్సి ఉంటుంది కరెంటు బిల్లులు ఈఎంఐలు కట్టాల్సి ఉంటుంది.

 

అలాంటి వాటికి మేము తప్పనిసరిగా వర్క్ చేయాలని అందుకే మాలాంటి వారికి నిబంధనలు సడలించాలంటూ కేటీఆర్ కు అనసూయ విజ్ఞప్తి చేసింది. దీంతో సోషల్ మీడియాలో అనసూయపై నెటిజన్లు రెచ్చిపోయారు. సిగ్గు లేదా నీకు అంటూ కొంతమంది విమర్శలు చేస్తుంటే, ఒకపక్క అభివృద్ధి చెందిన దేశాలలో శవాలు రోడ్లపై ఉంటే నువ్వు మేకప్ వేసుకొని షూటింగ్ అంటావు నీకు బుర్ర ఉందా..? షూటింగ్ వెళ్లి వైరస్ అంటించుకుని ఇతరులకు అంటించి దేశం స్మశానంగా మారుస్తావా అంటూ తెగ రెచ్చిపోయారు. దీంతో తనపై ఇష్టానుసారంగా మాట్లాడిన నెటిజన్ల పై వాళ్ళ అకౌంట్ ఆధారంగా సైబర్ కేస్ పెట్టాలని అనసూయ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: