ఆమె ఒక్క లేడీ సూపర్ స్టార్. ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయే భామ. సూపర్ నుంచి సింగం దాకా.. అరుంధతి నుంచి రుద్రమ దేవి దాకా.. ఏ పాత్ర అయినా.. అందులో చక్కగా ఒదిగిపోయే నటి  అనుష్క. అంతేకాదు ఆయా పాత్రలకు తన నటనతో నిండుదనం తెస్తుంది. ఇక రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన  ‘బాహుబలి’ సినిమాతో ఇండియా వైడ్‌గా ఫేమస్ అయింది.

 

బాహుబలి తర్వాత అనుష్క శెట్టి నటించిన ‘భాగమతి’ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది.ఆ తర్వాత చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో ఝాన్సీ లక్ష్మీబాయ్ పాత్రలో కాసేపు కనిపించి అభిమానులను కనువిందు చేసింది. తాజాగా ఈ భామ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘నిశ్శబ్ధం’ అనే  సినిమా చేసింది. 

 

అయితే గత కొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో హీరో ప్రభాస్, అనుష్కలపై వచ్చిన పుకార్లు మరెవరిపై రాలేదంటే నమ్మలేము. బాహుబలి తర్వాత వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు సైతం ప్రచారంలోకి వచ్చాయి. ఎన్నిసార్లు ఖండించినా మళ్లీ మళ్లీ ఈ రూమర్స్ ప్రచారంలోకి వస్తూనే వున్నాయి. 

 

తాజాగా సుమ హోస్ట్ చేస్తున్న క్యాష్ ప్రోగ్రామ్‌కు అనుష్క, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల, హేమంత్ మధుకర్ తదితరులు అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా సుమ అడిగిన పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది అనుష్క. ప్రభాస్‌తో ఫ్రెండ్‌షిప్, సినిమాల్లో యాక్టింగ్ అని ప్రశ్నించగా మరో ఆలోచన లేకుండా సినిమాల్లో నటించడం మానేస్తానని చెప్పింది అనుష్క. సినిమాలైన ఒదిలేస్తాను కానీ ప్రభాస్‌తోొ ఫ్రెండ్‌షిప్‌ మాత్రం ఒదులుకోలేనని చెప్పింది.

 

పూరీ జగన్నాథ్, రాజమౌళిలలో మీ ఫేవరేట్ దర్శకుడు ఎవరని అనుష్క ప్రశ్నించారు. అప్పుడు అనుష్క పూరీ జగన్నాథ్ పేరు చెప్పారు. ఆయన నాకు హీరోయిన్‌గా ఛాన్స్ ఇవ్వకపోతే తాను రాజమౌళిని కలిసే అవకాశమే ఉండేది కాదన్నారు. రాజమౌళి లేదా నాగార్జున ఎవరి కుటుంబంతో కలిసి మీరు టూర్‌కు వెళ్తారని ప్రశ్నించారు. అయితే అనుష్క రాజమౌళి ఫ్యామిలీతో టూర్‌కు వెళ్తానని కాస్త గడుసుగానే సమాధానమిచ్చింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: