ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోయన్స్ అంటే ఒకపక్క రష్మికమండన్న, మరో పక్క పూజా హెగ్డే వీరిద్దరూ కనిపిస్తున్నారు. ఏ సినిమాలో చూసినా వీరిద్దరే కనిపిస్తున్నారు. ఏదర్శకులకైనా హీరోయిన్లుగా వీరు తప్ప వేరే ఎవ్వరూ కనిపించడం లేదు. ఇటీవెల సూపర్స్టార్ మహేష్బాబుతో సరిలేరునీకెవ్వరు చిత్రంలో నటించి సూపర్డూపర్ హిట్ కొట్టింది. అయితే రష్మిక మహేష్తో కలిసి నటిస్తున్నందుకు చాలా ఎక్కువగా ఫీలవుతున్నారట. ఇక ఆ ఓవర్ ఫీలింగ్తోనే కాస్త అజాగ్రత్తగా ఉందట. కొంత పొగరుగా కూడా బిహేవ్ చేసినట్లు సినీ వర్గాల సమాచారం.
దాంతో ఓవర్ ఫీలింగ్తో రష్మిక కొన్ని అవకాశాలు మాత్రం ఒదులుకుందట. ఇక ఈమె ఇలా ఓవర్ ఫీలింగ్లో రష్మిక పూజాను తక్కువ అంచనా వేసిందట అయితే పూజా మాత్రం ప్రస్తుతం టాప్ రేంజ్లో ఉందనే చెప్పాలి. ఇటు బాలీవుడ్ అటు టాలీవుడ్ రెండిటిలోనూ మంచి అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ప్రస్తుతం పూజా సల్మాన్, అక్షయ్కుమార్ తో కలిసి రెండు చిత్రాలు చేయబోతుందట. అక్కడ రెండు పెద్ద ప్రాజెక్టులకు సైన్ చేసింది ఈ భామ. ఇక అది కాక త్రివిక్రమ్ మహేష్ సినిమాలో కూడా పూజా నే అనుకుంటున్నారు. అంతేకాక చిరు, కొరటాల చిత్రంలో కూడా మహేష్ సరసన పూజ నటిస్తదని వార్తలు బయటకొచ్చాయి. ఈ రకంగా చూస్తే అజాగ్రత్తగా ఉండే పూజా హెగ్డే తొక్కి పెట్టే సింది. అన్నట్లుగా కనిపిస్తుంది. కర్మకాలితే కాలికింద బల్లైనా కొట్టేస్తుంది.
దీంతో రష్మిక మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగితే ఆ ట్రోలింగ్లో రష్మిక మండిపడుతుందట. నాకు అవకాశాలు కనుక రాకపోతే నేను సరిలేరులో, భాష్మ్లో ఎలా చేస్తానంటూ ప్రశ్నిస్తోంది. అంతేకాక ఇప్పుడు బన్నీతో కలిసి సుకుమార్ దర్శకత్వంలో కూడా నటిస్తున్నా కదా అంటూ చెబుతోంది.