కరోనా ఎఫెక్ట్ తో టాలీవుడ్ వాయిదాల బాట పడుతోంది. ఇప్పటికే థియేటర్ల బంద్ తో మార్చి సినిమాలు వెనక్కి వెళ్లాయి. ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో రావాల్సిన సినిమాలు కూడా ఈ వైరస్ కు భయపడుతున్నాయి. ఈ వైరస్ ఎప్పటికీ కంట్రోల్ అవుతుందో తెలియక రిలీజ్ డేట్స్ ని వాయిదా వేసుకుంటున్నాయి.


కరోనా ఎఫెక్ట్ తో ఇప్పటికే నాని వి సినిమా పోస్ట్ పోన్ అయింది. మార్చి 31వరకు థియేటర్ల బంద్ ఉండటంతో మార్చి లాస్ట్ వీక్ సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. అయితే ప్రస్తుతం మార్చి 31వరకు బంద్ అని చెప్పినా... ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో అని టెన్షన్ పడుతున్నారు సినీ జనాలు. అందుకే ఏప్రిల్ 2న రావాల్సిన సినిమాలను వాయిదా వేస్తున్నారు నిర్మాతలు.

 

అనుష్క భాగమతి తర్వాత కొంత గ్యాప్ తీసుకొని నటించిన సినిమా నిశ్శబ్ధం. స్వీటీ మూగ చెవిటిగా నటించిన ఈ సినిమా ఏఫ్రిల్ 2న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా ఎఫెక్ట్ తో ఈ మూవీ వాయిదా పడుతోంది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ కు పరిస్థితులు కంట్రోల్ కాకపోతే ఎలా అని సందేహిస్తున్నారట దర్శకనిర్మాతలు. అందుకే ఈ మూవీని వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. అయితే ఈ మూవీ జనవరి 31నే రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కాలేదని వాయిదా వేశారు. ఇప్పుడు కరోనాతో పోస్ట్ పోన్ అయింది. 

 

ఏప్రిల్ 2న లాక్ చేసుకున్న మరో సినిమా ఉప్పెన కూడా వెనక్కి వెళ్తోంది. సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా లాంచ్ అవుతోన్న ఈ సినిమాను కూడా వాయిదా వేస్తున్నారట నిర్మాతలు. కరోనా కంట్రోల్ కు వచ్చాక థియేటర్లలోకి తీసుకెళ్దాం అనే ఆలోచనలో ఉన్నారట. మరి ఈ కరోనా కథ ఎపుడు ముగుస్తుందో.. థియేటర్లు మళ్లీ ఎప్పుడు కళకళలాడతాయో చూడాలి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: