మెగా స్టార్
చిరంజీవి -
సక్సెస్ ఫుల్
డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఈ
సినిమా ఇటీవల రెగ్యులర్ గా షూటింగ్ జరుపుకోగా.. ప్రస్తుతం
కరోనా వల్ల బ్రేక్ పడింది. తదుపరి షెడ్యూల్ ను ఏప్రిల్ లో మొదలు పెట్టనున్నారు. ఇక ఈ సినిమాలో
త్రిష ను
హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు కానీ అనివార్య కారణాల వల్ల చివరి నిమిషం లో ఆమె తప్పుకుంటున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది దాంతో
త్రిష స్థానం లో
కాజల్ ను తీసుకున్నారు. ఈవిషయాన్ని తాజాగా
కాజల్ కూడా అంగీకరించింది.
ఆచార్య షూటింగ్ లో జాయిన్ కావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఓ చిట్ చాట్ లో
కాజల్ వెల్లడించింది.
కాజల్ ,చిరు తో కలిసి నటించడం ఇది రెండో సారి. ఇంతకుముందు వీరిద్దరు
ఖైదీ నెంబర్ 150లో జోడిగా నటించారు.
సోషల్ మెసెజ్ తో కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఆచార్య లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించనున్నాడు. మే లో చరణ్ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. ఇదిలావుంటే ఉగాది కానుకగా ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను విడుదలచేయనున్నారని సమాచారం.
మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ ,కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ల పై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ముందుగా ఈచిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేయాలనుకున్నారు కానీ కరోనా వల్ల షూటింగ్ ఆలస్యం కానుండడంతో దసరా కానుకగా అక్టోబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక మొదటి సారి చిరు, కొరటాల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో ఆచార్య పై భారీ అంచనాలు వున్నాయి.