గత ఏడాది సాహో తో వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ కు ఆ చిత్రం భారీ షాక్ ఇచ్చింది. ఒక్క హిందీలో తప్ప సౌత్ లో దారుణమైన ఫలితాన్ని రాబట్టింది అయితే విపరీతమైన నెగటివ్ టాక్ తో సాహో ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్లు కలెక్ట్' చేసి ప్రభాస్ కు ఎటువంటి క్రేజ్ వుందో తెలియజేసింది. ఇక ఈ చిత్రం తరువాత ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో తన 20వ చిత్రంలో నటిస్తున్నాడు.
 
ఇటీవలే ఈసినిమా జార్జియా షెడ్యూల్ పూర్తి చేసుకుంది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే  హీరోయిన్ గా నటిస్తుండగా కృష్ణం రాజు ,భాగ్య శ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఉగాది రోజున ఫస్ట్ లుక్ విడుదలయ్యే ఛాన్స్ ఉండగా ఈచిత్రానికి ఓ డియర్ అనే టైటిల్ ప్రచారంలో వుంది. భారీ బడ్జెట్ తో గోపి కృష్ణ మూవీస్ ,యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తుండగా తెలుగుతో పాటు తమిళ ,హిందీ భాషల్లో విడుదలకానుంది. 
 
ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ప్రభాస్ ఇటీవలే  మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ 21 వ చిత్రాన్నిచేయనున్నాడు. ఈకాంబినేషన్ పై అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి. అయితే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుగుతుందని జూన్ లేదా జూలై లో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తుందని తాజాగా నాగ్ అశ్విన్ వెల్లడించాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ పతాకం పై  అశ్వినీదత్ నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది చివర్లో విడుదలకానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: