రాజకీయాల్లో బిజీగా ఉండి రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు పవన్ కల్యాణ్. పవన్ కల్యాణ్ మూడు సినిమాలకు సైన్ చేసి రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ లో పెట్టడం అభిమానులతో పాటు ఇండస్ట్రీకి సంతోషాన్నిస్తోంది. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే దిల్ రాజు ప్రొడక్షన్ లో వకీల్ సాబ్ చేస్తున్న పవన్ తర్వాతి ప్రాజెక్టుగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి. క్రిష్ తో సినిమా పాన్ ఇండియన్ సబ్జెక్ట్ తో తెరకెక్కుతోందని సమాచారం.

 

 

సినిమా గురించి ఓ లేటెస్ట్ అప్డేట్ ఇండస్ట్రీలో రౌండ్ అవుతోంది. ఈ సినిమాలో పవన్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడనేది ఆ వార్త సారాంశం. ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ తన కెరీర్లో డ్యూయల్ రోల్ చేయలేదు. తీన్ మార్ లో రెండు జనరేషన్ పాత్రలు చేశాడు కానీ దేనికీ సంబంధం ఉండదు. కాబట్టి ఆ సినిమా డ్యూయల్ రోల్ కి రాదు. చారిత్రక నేపథ్యం ఉన్న కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై క్రేజ్ పీక్స్ లో ఉంది. సినిమా టైటిల్ ను విరూపాక్ష అని కూడా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా జాక్వెలెస్ ఫెర్నాండెజ్, పూజా హెగ్డే పేర్లు వినిపిస్తున్నా ఇంకా క్లారిటీ లేదు.

 

 

మరి.. ఈ సినిమాలో పవన్ డ్యూయల్ రోల్ అనే మాటలో నిజమెంతో యూనిట్ రివీల్ చేయాల్సి ఉంది. శ్రీ సూర్యా మూవీస్ బ్యానర్ పై ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. గతంలో పవన్ తో ఖుషి వంటి ఇండస్ట్రీ హిట్ తీశాడు రత్నం. తర్వాత బంగారం సినిమా తీసినా ఆ సినిమా ఫ్లాప్ అయింది. ప్రస్తుతం ఈ సినిమాపై భారీ అంచానాలు ఉన్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: