టాలీవుడ్ హీరోలు ఇప్పుడు ఫ్రెష్ కాంబినేషన్స్ నే కోరుకుంటున్నారు. కొత్త హీరోయిన్లతో స్టెప్పులేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే రవితేజ మాత్రం కంఫర్ట్ లెవల్స్ కే ప్రియారిటీ ఇస్తున్నాడు. వరుసగా పాత హీరోయిన్లనే రిపీట్ చేస్తున్నాడు. ఇంతకుముందు కలిసి నటించిన బ్యూటీస్ తోనే సినిమాలు చేస్తున్నాడు రవితేజ. 

 

రవితేజ పాత కాంబినేషన్ రిపీట్ చేస్తున్నాడు. కొత్త హీరోయిన్లను తీసుకొని వర్క్ షాప్స్ కు వెళ్లేకంటే.. ఇంతకుముందు కలిసి నటించిన హీరోయిన్లతో కలిసి సెట్స్ కు వెళ్లడమే బెటర్ అనుకుంటున్నాడు. క్రాక్ సినిమాకు శ్రుతిహాసన్ ని ఇలాగే సెలక్ట్ చేసుకున్నాడు. బలుపులో జోడీగా నటించిన శ్రుతిని క్రాక్ హీరోయిన్ గా తీసుకున్నాడు. తర్వాత సినిమాలకు ఇలాగే రిపీటెడ్ కాంబినేషన్స్ నే తీసుకుంటున్నాడు. 

 

రవితేజ తర్వాత రమేశ్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీలో మాస్ మహారాజ డ్యుయల్ రోల్ ప్లే చేస్తాడని ప్రచారం జరిగింది. ఈ ప్రాజెక్ట్ లో ఓ హీరోయిన్ గా మాళవిక శర్మను తీసుకుంటున్నారట. ఇంతకుముందు రవితేజతో కలిసి నేలటిక్కెట్టులో నటించింది మాళవిక.

 

రమేశ్ వర్మ సినిమా తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఈ మూవీలో తమన్నాను హీరోయిన్ గా సెలక్ట్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఇక బెంగాల్ టైగర్ లో తమన్నా హీరోయిన్ గా నటించింది. సో ఈ లిస్ట్ చూస్తుంటే రవితేజ కొత్త దర్శకులతో సినిమాలకు సైన్ చేసినా.. హీరోయిన్ల విషయంలో మాత్రం పాత వాళ్లకే ఓటేస్తున్నట్టు కనిపిస్తోంది. 
 

రవితేజకు ఫ్యాన్స్ పాలోయింగ్ ఎక్కువే. ఆయన డైలాగ్ డెలివరీ అంటే జనాలు పడి చస్తారు. మాస్ రాజా నోట ఏ మాత వస్తుందా అని ఆసక్తిని కనుబరుస్తారు. అలాంటి రవితేజ ఓ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. అందుకే తనకు అనుకూలంగా ఉన్న హీరోయిన్ లను రిపీట్ చేస్తున్నాడు. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: