ఎవరైనా ఆఫర్స్ తగ్గిపోతే బాధపడతారు. కానీ కియారా అద్వానీ మాత్రం అవకాశాలు వస్తోంటే బాధపడుతోంది. కొన్నాళ్లపాటు ఎవరూ కాంటాక్ట్ చేయకపోతే బాగుంటుందని ప్రే చేస్తోంది. అంటే కియారాకు సినిమాలపై ఫ్యాషన్ తగ్గిపోయిందా.. లేక కెరీర్ బ్రేక్ ఇవ్వాలనుకుంటోందా..?

 

కియారా ఆద్వానీ ఇంకా బడ్డింగ్ స్టేజ్ లో ఉంది. తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా టాప్ రేస్ కు దగ్గరవ్వలేదు. కబీర్ సింగ్ తో బాలీవుడ్ లో సూపర్ హిట్ కొట్టినా, మీడియం రేంజ్ లోనే ఉంది. మరి ఇలాంటి స్టేజ్ లో ఉన్నా.. అవకాశాలు లేకపోతే బాగుంటుందని ఎందుకు అనుకుంటోంది అంటే రిలేషన్స్ కోసమే అంటున్నారు జనాలు. 

 

కియారా అద్వానీ ఇప్పుడు నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. అక్షయ్ కుమార్ తో లక్ష్మీబాంబ్, సిద్ధార్థ్ మల్హోత్రాతో షేర్ షా, కార్తీక్ ఆర్యన్ తో భూల్ భులాయా 2 సినిమాలు చేస్తోంది. వీటితో పాటు ఇందూకి జవాని అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యేందుకు మరో ఏడాది పట్టే అవకాశం ఉంది. 

 

కియారాకు నెక్స్ట్ ఇయర్ వరకు కాల్షీట్స్ ఖాళీగా లేవు. కానీ లవ్ స్టోరీస్ తో లైఫ్ ఇచ్చిన కరణ్ జోహార్ రీసెంట్ గానే మిస్టర్ లేలే ఆఫర్ చేశాడు. బట్ బిజీ షెడ్యూల్స్ లో డేట్స్ ఇవ్వలేనని చెప్పింది కియారా. అలాగే మోహిత్ సూరి ఏక్ విలన్ సీక్వెల్ కు డేట్స్ అడిగితే అడ్జస్ట్ చేయలేకపోయింది. ఇలా స్టార్ మేకర్స్ అందరికీ నో చెబుతూ పోతే ఫ్యూచర్ దెబ్బ తింటుందేమో అని భయపడుతోందట కియారా. అందుకే నో చెప్పి బాధపడటం కంటే.. ఈ నాలుగు సినిమాలు అయ్యేవరకు కొత్తగా అవకాశాలు రాకపోతేనే బెటర్ అని ప్రే చేస్తోందట కియారా. 

మరింత సమాచారం తెలుసుకోండి: