దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు హారికా హాసిని నిర్మాణ సంస్థకు ఉన్న అనుబంధం ఓపెన్ సీక్రెట్. ఈ ప్రొడక్షన్ హౌస్ లో త్రివిక్రమ్ భాగస్వామి అన్న ప్రచారం కూడ ఉంది. అందువల్లనే గత కొన్ని సంవత్సరాలుగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలు అన్నీ హరికా హాసిని బ్యానర్ నిర్మాణంలోనే వస్తున్నాయి. 


ఈ నిర్మాణ సంస్థకు అనుబంధంగా సితారా ఎంటర్ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థ కూడ ఉంది. ఈ బ్యానర్ పై ఈమధ్యనే వచ్చిన ‘భీష్మ’ మూవీ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితులలో ఈమధ్య సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్య‌దేవ‌ర‌నాగ‌వంశీ మళయాళ దర్శకుడు స‌చీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌’ అనే మూవీ రైట్స్ ను కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

 

మలయాళంలో సంచ‌ల‌న విజ‌యం సాధించిన ఈ మూవీలో పృథ్వీరాజ్‌ బీజు మీన‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈమూవీ రైట్స్ ను ఈ నిర్మాణ సంస్థ ఈమధ్య కొన్న తరువాత ఆ మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ చూసినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ మూవీలోని పృథ్వీరాజ్ పాత్ర బాలకృష్ణకు బాగా నప్పుతుందని త్రివిక్రమ్ బాలయ్య పేరును సూచించినట్లు తెలుస్తోంది. 


అయితే ఈ మూవీలో రెండవ హీరో పాత్ర కూడ చాల కీలకం కాబట్టి ఆ పాత్రను ఎవరి చేత చేయిస్తే బాగుంటుంది అన్న ఆలోచనలు కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ మూవీని బాలయ్య ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న మూవీ షూటింగ్ పూర్తి అయిన తరువాత ఈ సంవత్సరం చివరిలో ప్రారంభించే ఆలోచనలు ఉన్నట్లు టాక్. వాస్తవానికి త్రివిక్రమ్ కు జూనియర్ తో ఆమంచి సాన్నిహిత్యం ఉంది కాని బాలయ్యతో చెప్పుకో తగ్గ సాన్నిహిత్యం లేదు. ఇలాంటి పరిస్థితులలో బాలయ్య పేరు త్రివిక్రమ్ నోటి వెంట సూచనగా వచ్చింది అని వార్తలు రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: