దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం రోజు రోజుకీ పెరిగిపోతుంది.  ప్రపంచాన్ని కబలిస్తున్న ఈ కరోనా వైరస్ దేశంలో ఇప్పటికే 300 కు పైగా కేసులు నమోదు అయ్యాయి. 8 మంది ఈ కరోనా భారిన పడి మరణించారు.  ఇలా రోజు రోజు కీ లెక్కలు పెరిగిపోతున్నాయి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశ ప్రజలు కంకణం కట్టుకున్నారు. రెండు రాష్ట్రాల మినహా అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ చేశాయి.  ఆదివారం దేశం మొత్తం ‘జనతా కర్ఫ్యూ’ పాటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ ప్రజలంతా ఒక్కతాటిపైకి వచ్చారని.. ఇతర దేశాలు మెచ్చుకున్న విషయం తెలిసిందే. కేవలం జనతా కర్ఫ్యూనే కాదు కొంత కాలం పాటు ప్రజల బిజీ జీవితానికి విరామం ఇవ్వాలని.. సాధ్యమైనంత వరకు ఇంటి పట్టున ఉంటూ వైరస్ విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. 


పవన్ కల్యాణ్ తాజా మూవీ 'వకీల్ సాబ్' రూపొందుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పట్ల అభిమానులు ఆసక్తితో వున్నారు. ఈ సినిమా తరువాత క్రిష్ దర్శకత్వంలో పవన్ ఒక సినిమా చేయనున్నాడు. ఇది ఓ పిరియాడికల్ మూవీ.. ఇందులో పవన్ కళ్యాన్ రాబిన్ హుడ్ లా ఓ గజదొంగ పాత్రలో కనిపించబోతున్నారని అంటున్నారు.  ఈ మూవీకి సంబందించిన ఓ లుక్ కూడా ఇటీవల లీక్ అయ్యిందని వార్తలు కూడా వచ్చాయి.  ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం వల్ల చాలా వరకు సినిమా షూటింగ్స్ క్యాన్సల్ చేసుకుంటున్నారు. 


ఈ నేపథ్యంలో క్రిష్ - పవన్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ మరికొంత కాలం పడుతుందని అంటున్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి క్రిష్ పవన్ పోర్షన్ ను ప్లాన్ చేశాడట. ఆ వారం నుంచి హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగు జరగవలసి వుంది. అయితే ఆ షెడ్యూల్ ను వాయిదా వేసుకోమనీ, 40 రోజుల వరకూ తనకి సంబంధించిన షూటింగును ప్లాన్ చేయవద్దని పవన్ కల్యాణ్ చెప్పాడట. దాంతో క్రిష్ సైతం పవన్ సూచనలు పాటించబోతున్నట్లు సమాచారం.   ఎ.ఎమ్. రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకి 'విరూపాక్ష' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: