ప్రస్తుతం హీరోలతో సమానంగా క్యారెక్టర్ ఆర్టిస్టుల పారితోషికాలు కూడ భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. మంచి హిట్లు రెండు వరసగా తగిలేతే చాలు భారీ స్థాయిలో వీరు తమ పారితోషికాలు పెంచుతూ నిర్మాతలకు చుక్కలు చూపెడుతున్నారు. జగపతి బాబు ప్రకాష్ రాజ్ రావు రమేశ్ సీనియర్ నరేశ్ రాజేంద్రప్రసాద్ ఇలాచాల మంది అమాంతంగా తమ పారితోషికాల్ని పెంచేసి క్రేజు ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలన్న సూత్రాన్ని అనుసరిస్తున్నారు.
ఈ లిస్టులో ఇప్పడు ‘మిర్చి’ మూవీ ద్వారా పాపులర్ అయిన సంపత్ కూడ చేరిపోయారు. ‘మిర్చి’ సినిమా నుండి సంపత్ టాలీవుడ్ విలన్ల లిస్టులో ప్రముఖ స్థానంలో లేటెస్ట్ గా వచ్చిన ‘భీష్మ’ మూవీతో తాను కూడా నవ్వించగలనని నిరూపించాడు. ఇప్పుడు ఈ విలక్షణ నటుడు చిరంజీవి కొరటాల మూవీ ‘ఆచార్య’ కు చుక్కలు చూపెడుతున్నాడు అని వార్తలు వస్తున్నాయి.
వాస్తవానికి సంపత్ కొరటాల దర్శకత్వం వహించిన ‘మిర్చి’ మూవీ ద్వారా మంచి క్రేజ్ లోకి వచ్చాడు. ఈ మూవీ తరువాత కొరటాల శివ తాను దర్శకత్వం వహించే ప్రతి సినిమాలో సంపత్ కు అవకాశాలు ఇవ్వడం ఒక అలవాటుగా మార్చుకున్నాడు. ఈ పద్ధతిని కొనసాగిస్తూ కొరటాల శివ చిరంజీవి 152 వ చిత్రం ‘ఆచార్యలో’ సంపత్ కి ఒక మంచి పాత్రను క్రియేట్ చేసి అతడి డేట్స్ ను అడిగినట్లు టాక్.
అయితే సంపత్ ఈ మూవీలో నటించడానికి చెప్పిన పారితోషికం విని కొరటాల మైండ్ బ్లాంక్ అయినట్లు టాక్. సంపత్ కనీవిని పారితోషికాన్ని కోట్ చేయడంతో ప్రస్తుతం అతడి పాత్ర విషయంలోకొరటాల డైలమాలో ఉనట్లు వార్తలు వస్తున్నాయి. సాధారణంగా చిరంజీవి లాంటి స్టార్ హీరో సినిమాలో ఆఫర్ వచ్చినప్పుడు నటీనటులు పారితోషికం గురించి పెద్దగా ఆలోచించరు. అయితే దీనికి భిన్నంగా సంపత్ ప్రవర్తించడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గామారింది. ఇప్పటికే ఆచార్య సినిమాలో నటించడానికి కాజల్ భారీ పారితోషికం అడిగినట్లుగా వార్తలు వస్తున్న పరిస్థితులలో ఇప్పడు ఈ లిస్టులో సంపత్ చేరిపోవడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది..