దేశ వ్యాప్తంగా ఇప్పుడు లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రజలు స్వచ్చందంగా నిర్వహిస్తున్న కార్యక్రమం.  లాక్ డౌన్ తో ఎక్కడికక్కడే జనాలు ఇంటికే పరిమితం అయ్యారు. కొంత మంది అత్యవసర సేవలు చేసేవారు తప్ప చాలా మంది తమ ఇళ్లకే పరిమతం అయ్యారు.  బయట తిరిగితే ఈ కరోనా విజృంభిస్తుందని.. మూడో దశంలో దీన్ని ఎంత వరకు అరికడితే అంత మేలు జరుగుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.  ఈ నేపథ్యంలోనే మొన్న ఆదివారం దేశ వ్యాప్తంగా ‘జనతా కర్ఫ్యూ’ కి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.  ఇందులో భారతీయులంతా స్వచ్చందంగా పాల్గొని ఐదు గంటలకు సంఘీభావంగా చప్పట్లు కొట్టారు. 

 


 ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా చిన్నా, పెద్ద.. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఇంటిపట్టునే ఉంటున్నారు. ఒక్క రోజు ఇంటిలో గడపాలంటే పరమ బోర్ అని ఫీల్ అయ్యేవారు ఇప్పుడు పది రోజులు ఇంటిపట్టున ఉండాలంటే పరిస్థితి ఏంటా అని అంటున్నారు.  ఈ నేపథ్యంలో సెలబ్రెటీలు ఎవరికి తోచిన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. తాజాగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  మీ ఇంట్లో బొర్ కొడుతుందీ అనుకుంటే.. ఇలా హార్స్ రైడ్ చేయండీ అంటూ పోస్ట్ చేశారు. 


ఇందులో ఇద్దరు స్త్రీ, పురుషులు బ్లాక్ డ్రెస్ వేసుకొని అచ్చం హార్స్ రైడింగ్ లో చేయడం నిజంగా ఎంతో ఫన్నీగా ఉంది.  ఇది చూస్తే మీరూ ఎంటర్ టైన్ అవుతారని అంటూ కామెంట్ చేశాడు. పూరి పోస్ట్ చేసిన కొద్ది సేపటికే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల ఇస్మార్ట్ శంకర్‌ సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ హీరోగా ఓ మల్టీ లింగ్యువల్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్‌ తో కలిసి పూరీ స్వయంగా నిర్మిస్తున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Hi Guys, You won’t get bored sitting at home. Do some Horse Riding indoors to keep yourself entertained 👇🏽

A post shared by puri Jagannadh (@purijagannadh) on

మరింత సమాచారం తెలుసుకోండి: