తెలుగు ఇండస్ట్రీలో గత ఏడాది ‘ఎఫ్ 2’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్.  అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంతో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించారు.  భార్య, ప్రియురాలి టార్చర్ తో ప్రెస్టేషన్ లోకి వెళ్లిన ఇద్దరు వ్యక్తుల కథ నేపథ్యంలో ఫుల్ లెన్త్ కామెడీతో ఎంటర్ టైన్ మెంట్ తో ఈ చిత్ర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.  తాజాగా ఈ చిత్రం సీక్వెల్ గురించి నిర్మాత దిల్ రాజు ప్రస్తావించారు.  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఉండటంతో ఈ చిత్రం ఆగస్టు లో రెగ్యులర్ షూటింగ్ ఉండబోతున్నట్లు తెలిపారు. 

 

వాస్తవానికి ఎఫ్ 2 సీక్వెల్ గా ఎఫ్ 3 షూటింగ్ ఇప్పటికే ప్రారంభించాల్సి ఉంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఆ సీక్వెల్ కి సంబంధించిన స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నాడు. అయితే ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ మొదలు కావాలని అనిల్ రావిపూడితో 'దిల్' రాజు చెప్పాడట. ఇక ఎఫ్ 3 లో మరి ప్రెస్టేషన్ ఉంటుందా.. ప్రేమ, ఎమోషన్స్ ఉంటాయా చూడాలి.  ఎఫ్ 2 లో వెంకటేష్, వరుణ్ తేజ్, రాజేంద్ర ప్రసాద్ తమదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించారు.  అయితే ఎఫ్ 3 లో వెంకటేశ్ - వరుణ్ తేజ్ లు ఈ సీక్వెల్ లో ఉండటం ఖాయమైపోయింది.  మరి ఇతర నటుల విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

 

ఆ మద్య ఈ మూవీలో మాస్ మహరాజా నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.. ఇది స్పెషల్ గెస్టా లేదా ఫుల్ లెన్త్ పాత్రనా అన్న విషయంపై క్లారిటీ లేదు.  ఇక ఈ మూవీలో హీరోయిన్ల విషయంలో కూడా ఎలాంటి క్లారిటీ లేదు. అంతా ఓకే అయ్యాక అనౌన్స్ మెంట్ చేస్తారని అంటున్నారు.  మరి ఎఫ్ 3 ఎంతగా నవ్విస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: