తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాన్ నటించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన జనసేన పార్టీ తరుపు నుంచి రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. కానీ ఓడిపోయారు.. దాంతో ఇప్పుడు మళ్లీ తెరపై కనిపించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన మూవీ ‘పింక్ ’ రిమేక్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘వకీల్ సాబ్ ’ మూవీ టైటిల్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ఉండటం వల్ల వాయిదా వేశారు. అయితే ఈ చిత్రం పై భారీ అంచనాలే నెలకొన్నాయి అభిమానుల్లో.
ఈ చిత్రం తర్వాత వెంటనే క్రిష్ దర్శకత్వంలో మరో చిత్రంలోనటించబోతున్నాడు పవన్ కళ్యాన్. అయితే ఇది పిరియాడికల్ చిత్రమని అంటున్నారు. ఆంగ్లేయుల కాలంలో ఈ కథ నడుస్తుందట. ఈ కథలో పవన్ .. ఆంగ్లేయులను ఎదిరించే బందిపోటుగా కనిపించనున్నాడనే టాక్ వచ్చింది. ఒకప్పుడు రాబిన్ హుడ్ టైప్ లో అన్నమాట.. ధనికులను దోచి పేదవాళ్లకు పంచే కాన్సెప్ట్ లో అంటున్నారు. కేవలం ఈ మూవీలో బందిపోటుగానే కాకుండా మరో పాత్రలో పవన్ కనిపించబోతున్నాడట. అంటే పవన్ ద్విపాత్రాభినయం చేయనున్నాడన్న మాట.
పవన్ చేసే మరో పాత్ర ఎలా వుండబోతోంది? ఆ పాత్రను క్రిష్ ఎలా డిజైన్ చేశాడు? ఆ పాత్రలో పవన్ ఎలా కనిపించనున్నాడు? అనేవి ఆయన అభిమానుల్లో ఆసక్తిని పెంచే అంశాలనే చెప్పాలి. సాధారణంగా స్టార్ హీరోలు సింగిల్ పాత్ర అంటేనే ఓ రేంజ్ లో అంచనాలు ఉంటాయి.. అలాంటిది ద్విపాత్రాభినయం అంటే ఇక ఫ్యాన్స్ ఆనందానికి హద్దులే ఉండవు. గతంలో మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయంలో నటించిన చిత్రాలు ఎన్నో సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.