ఓ వైపు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు కష్టపడుతున్నాయి. చాప కింద నీరులా విజృంభిస్తున్న ఈ వైరస్ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, కరోనా రాకుండా చేయాలంటే ఓ పని చేయాలంటూ సోషల్ మీడియాలో మూఢ నమ్మకాలు జోరుగా ముచ్చట్లు పెడుతున్నాయి. పట్టణాల దగ్గర నుంచి గ్రామాల వరకు చాలా మంది ఈ మూఢ నమ్మకాన్ని పాటిస్తున్నారు. ఏంటీ మా పరిస్థితి అని భయంతో వణికిపోతుంటే కొంత మంది మాత్రం ఈ పానిక్ సిట్యువేషన్ని తెలివిగా తమ పబ్లిసిటీకి ఉపయోగించుకుంటు న్నారు. దీని ద్వారా సోషల్ మీడియాలో వైరల్ కావాలని మరొకొంత మంది ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా మహమ్మారి వరల్డ్ వైడ్గా లక్షల్లో ప్రాణాల్ని కోల్పోతున్నారు. వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియని అయోమయంలో జనం వుంటే రామ్చరణ్ హీరోయిన్ మాత్రం ఈ సందర్భాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటోంది.
`చిరుత` చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ఢిల్లీ సోయగం నేహాశర్మ గత కొంత కాలంగా బాలీవుడ్తో పాటు పంజాబీ చిత్రాల్లో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఎన్ని చిత్రాల్లో నటించినప్పటికీ పెద్ద పేరు రాకపోవడంతో ఒక గ్లామర్ షోతో ఆకట్టుకుందామని మొదలు పెట్టింది. ఇక ఈ మధ్య ప్రతి హీరోయిన్ చేసే పని అదే. అలానే ఈ భామ కూడా మొదలు పెట్టింది తన హాట్ షోతో దర్శకనిర్మాతలకు ఎరవేస్తుంది. ఈ భామ సోషల్ మీడియా ఇన్ స్టాని ఇందుకు వేదికగా వాడుకుంటూ ఇంటర్నెట్ని హీటెక్కిస్తోంది.
తాజాగా నేహాశర్మ పెట్టిన ఓ ఫొటో, పోస్ట్ నెటిజన్స్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కరోనా వైరస్తో అంతా భయాందోళనకు గురవుతుంటే రిలాక్స్ కోసం అందరినీ తన హాట్ షోతో కూల్ చేస్తుంది. ఆ భయాలన్నీ పక్కన పెట్టండి. అందరికి ఆనందకరమైన విషయం ఏమిటంటే ... ఇంట్లోనే వుండండి. సురక్షితంగా వుండండి అంటూ ఓ హాట్ ఫొటోని షేర్ చేసింది. నేహాశర్మ తీరు చూసిన నెటిజన్స్ అంతా అవాక్కవుతున్నారు. ఈ భామ అందాల ఫొటోలకి ఫిదా అవుతున్నారు.