ఇప్పుడు కరోనా దెబ్బకు అందరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు వచ్చే పరిస్థితి కనపడటం లేదు. ఇళ్ళల్లోనే ఎక్కువగా ఉంటున్నారు అందరూ కూడా. తమ వంతు సహకారం ప్రభుత్వాలకు అందిస్తూ లాక్ డౌన్ ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఎక్కడో ఒక చోట మినహా అన్ని ప్రాంతాల్లో కూడా లాక్ డౌన్ అనేది విజయవంతంగా అమలు అవుతుంది అనే మాట వాస్తవం. ప్రాణాల మీద భయం ఎక్కువగా ఉండటంతో ఎవరూ కూడా బయటకు వచ్చే ప్రయత్నాలు చేయడం లేదు అనేది అర్ధమవుతుంది. పరిస్థితి చేయి దాటి పోవడం కూడా వాళ్ళను ఆందోళనకు గురి చేస్తుంది. 

 

దీనికి సినీ హీరోలు కూడా ఇళ్ళ నుంచి బయటకు రాకుండా తమ వంతు సహకారం ప్రభుత్వాలకు అందిస్తున్నారు వాళ్ళు. దాదాపు అందరు స్టార్ హీరోలు కూడా ఇంట్లోనే ఎక్కువగా ఉంటున్నారు. మన దేశంలో సినిమా హీరోలు కనపడకపోతే జనాలు మర్చిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అభిమానులకు ఏదోక విధంగా కనపడాలని భావిస్తున్నారు. అందుకోసం ఇప్పుడు సోషల్ మీడియాను ఎక్కువగా నమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా వీడియో లను పోస్ట్ చేస్తున్నారు ఎక్కువగా. 

 

తాజాగా తెలుగు స్టార్ హీరో ఒకరు తన కుమార్తె ను పెట్టి యుట్యూబ్ లో కొన్ని వీడియో లు చేయడానికి ప్లాన్ చేసినట్టు సమాచారం. ఆమె ద్వారా అభిమానులకు వినోదాన్ని పంచాలని సదరు హీరో గారు ఎక్కువగా భావిస్తున్నారు. మొబైల్ లో వీడియో లను ఎక్కువగా పోస్ట్ చేస్తూ సందడి చేస్తున్నారు. అభిమానులకు ఈ విధంగా దగ్గరయ్యేందుకు మరింతగా కష్టపడుతున్నారు పాపం. ఇక తమ కుమార్తె లకు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు కొంత మంది హీరోలు. మరి ఇది ఎంత వరకు ఫలిస్తుంది అనేది చూడాలి. మహేష్ బాబు, అల్లు అర్జున్ సహా కొందరు ఈ ప్రయత్నాలను చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: