ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ మంచి ఊపు మీద ఉన్నాడు. అతని సినిమాల మీద మళ్ళీ జనాలకు కాస్త ఆసక్తి పెరిగింది అనే మాట అందరికి స్పష్టంగా అర్ధమవుతుంది. సినిమా ఎలా ఉన్నా సరే పూరి కోసం సినిమా చూసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తున్నాడు. వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత విజయ్ చేస్తున్న ఈ సినిమాపై అతని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు పూరి జగన్నాథ్ తనకు నచ్చిన హీరోలతో సినిమాలు చెయ్యాలని భావిస్తున్నాడు. ఈ నేపధ్యంలోనే సీనియర్ హీరోలను లైన్ లో పెడుతున్నాడు అతను. తనకు అమ్మా నాన్నతమిళ అమ్మాయి సినిమా తో మంచి హిట్ ఇచ్చిన రవి తేజా తో సినిమా చెయ్యాలని భావిస్తున్నాడు. ఇప్పటికే కథ కూడా రెడీ చేయగా ఆ కథను వెళ్లి చార్మీ రవి తేజాకు వినిపించినట్టు సమాచారం. త్వరలోనే ఈ కథ పూర్తి స్థాయిలో రెడీ అయితే సినిమా చేయడానికి సిద్దంగా ఉన్నాడట రవి తేజా. అతను ఇప్పుడు క్రాక్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మధ్య హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. 

 

ఇప్పుడు పూరి జగన్నాథ్ అతనికి మంచి హిట్ ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమాపై సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిర్మాత ఎవరు అనేది స్పష్టత రావడం లేదు. త్వరలోనే నిర్మాతను కూడా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఎలా ఈ సినిమా టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: