టాలీవుడ్ లో ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హవా ఎక్కువగానే నడుస్తుంది. అరవింద సమేత సినిమా తర్వాత రాజమౌళి తో అతను సినిమా చేయడం తో అందరూ అతని సినిమాపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమా ఇప్పుడు కరోనా కారణంగా ఆగిపోయింది. త్వరలోనే షూటింగ్ ని మొదలుపెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి అనేది చిత్ర యూనిట్ త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

 

ఈ సినిమాలో తన కొడుకులు ఇద్దరినీ చూపించడానికి అతను సిద్దమైనట్టు సమాచారం. అభయ్ ని భార్గవ్ ని చూపించడానికి అతను ఆసక్తి చూపిస్తున్నాడని దర్శకుడు రాజమౌళి కి కూడా ఇదే విషయం అతను చెప్పాడని అంటున్నాడు. త్వరలోనే వీరికి సంబంధించిన పాత్రలను కూడా సిద్దం చేసి వారితో షూటింగ్ కూడా చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఎన్టీఆర్ చిన్న నాటి పాత్రలో అభయ్ కనపడే అవకాశాలు ఉండగా... ఎన్టీఆర్ కొడుకు పాత్రలో మాత్రం భార్గవ్ కనపడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

 

ఈ పాత్రలకు సంబంధించి రాజమౌళి కూడా అంగీకారం తెలిపినట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంది౦చి ఒక ప్రకటన కూడా వస్తుంది అంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నాడు. రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్లు గా ముగ్గురు నటిస్తున్నారు. ఒలివియా మోరిస్ ఎన్టీఆర్ సరసన కనపడుతుండగా అలియా భట్ మాత్రం రామ్ చరణ్ సరసన కనపడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 28 న రామ్ చరణ్ లుక్ ని విడుదల చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: